ENGLISH

బన్నీ కోసం ఇద్దరు హీరోయిన్స్

29 April 2024-23:20 PM

గుంటూరు కారం సినిమాతో డిజాస్టర్ చూసిన త్రివిక్రమ్ నెక్స్ట్ సినిమాని గట్టిగా ప్లాన్ చేస్తున్నాడు. గుంటూరు కారం మూవీ విషయంలో భారీగా ట్రోల్స్ ఎదుర్కొన్నాడు త్రివిక్రమ్. దీనితో నెక్స్ట్ ఎవరితో సినిమా చేయాలో తెలియక కొంచెం డైలమాలో ఉండి పోయాడు. పుష్ప 2 తరవాత బన్నీ తో ఒక మూవీ అనౌన్స్ చేసినా, గుంటూరు కారం ఫ్లాప్ వలన బన్నీ త్రివిక్రమ్ ని హోల్డ్ లో పెట్టాడని, అట్లీతో సినిమా చేసే ఆలోచనలో ఉన్నాడని ప్రచారం జరిగింది. ఈ క్రమంలోనే  త్రివిక్రమ్ వెంకటేష్ తో ఒక ప్రాజెక్ట్ చేస్తాడని కొన్నాళ్ళు, లేదు  నానితో అని రకరకాల వార్తలు వచ్చాయి. చివరికి ఇప్పుడు బన్నీ త్రివిక్రమ్ కాంబో మొదలవనున్నట్లు తెలుస్తోంది.            


త్రివిక్రమ్, బన్నీలది హిట్ కాంబో. ఇప్పటికే వీరి కలయికలో మూడు సినిమాలు వచ్చాయి.  జులాయి, సన్ ఆఫ్ సత్య మూర్తి, అల వైకుంఠపురం ఇవన్నీ బ్లాక్ బ్లస్టర్లే.  మళ్ళీ వీరి కాంబోలో మూవీ అనగానే సినీప్రియులు ఎంతో  ఆసక్తిగా ఉన్నారు. పైగా గుంటూరు కారంతో వచ్చిన వ్యతిరేఖతను త్రివిక్రమ్ దూరం చేసే ప్రయత్నంలో ఉన్నట్టు తెలుస్తోంది. ఈ సినిమా ఎప్పుడు మొదలవుతుంది. నటీ నటుల గూర్చి చర్చ జరుగుతున్న నేపథ్యంలో సాలిడ్ అప్డేట్ ఒకటి వచ్చింది. నేషనల్ స్టార్ పక్కన నేషనల్ అవార్డు విన్నర్  హీరోయిన్ గా నటిస్తుందని సమాచారం. 


బన్నీ, త్రివిక్రమ్ సినిమాలో ఇద్దరు హీరోయిన్స్ ఉండనున్నారని టాక్. అందులో ఒకరు పూజ హెగ్డే. ఇప్పటికే బన్నీ పూజ కాంబోలో వచ్చిన DJ , అల వైకుంఠ పురం సినిమాలతో హిట్ పెయిర్ అనిపించుకున్నారు. ముచ్చటగా మూడోసారి వీరిద్దరూ కలిసి నటిస్తున్నారు.   ఇంకొకరు  బన్నీతో పాటు నేషనల్ అవార్డు అందుకున్న కృతి సనన్. కృతిసనన్ పాన్ ఇండియా హీరోయిన్ గా వరస అవకాశాలు అందుకుంటోంది. రీసెంట్ గా 'క్రూ' సినిమాతో బాలీవుడ్ లో పెద్ద హిట్ తన ఖాతాలో వేసుకుంది. ఇప్పుడుత్రివిక్రమ్ మూవీలో ఛాన్స్ అంటే, లక్ అనే చెప్పాలి. ఈ మూవీ హిట్ అయితే వరుసగా త్రివిక్రమ్ సినిమాల్లో కృతికి ఛాన్స్ లభిస్తుంది.