ENGLISH

పూజ కూడా పెంచేసింది.. ఇప్పుడెలా?

17 October 2020-15:00 PM

క‌రోనా త‌ర‌వాత‌.. హీరో, హీరోయిన్లంతా పారితోషికాలు తగ్గించుకోవాల‌న్న డిమాండ్ మ‌రింత ఎక్కువ‌గా వినిపిస్తోంది. పారితోషికాలు త‌గ్గించుకోవ‌డం వ‌ల్ల‌, బ‌డ్జెట్లు త‌గ్గుతాయి. నిర్మాత‌లు సేఫ్ అవుతారు. అయితే... ఎవ‌రూ పారితోషికాలు త‌గ్గించుకోవ‌డానికి ఇష్ట‌ప‌డ‌డం లేదు. స‌రిక‌దా.. పెంచుకుంటూ పోతున్నారు. మ‌రీ ముఖ్యంగా క‌థానాయిక‌లు. స‌మంత‌, కీర్తి సురేష్‌, ర‌ష్మిక.. వీళ్లంతా తాజాగా త‌మ పారితోషికాల్ని పెంచేసిన‌ట్టు భోగ‌ట్టా. ఇప్పుడు పూజా హెగ్డేకూడా త‌న పారితోషికం పెంచింద‌ని స‌మాచారం.

 

టాలీవుడ్ లో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ గా మారిపోయింది పూజా హెగ్డే. `అల వైకుంఠ‌పుర‌ములో` లాంటి సూప‌ర్ హిట్ త‌న ఖాతాలో వేసుకుంది. ఓ వైపు ప్ర‌భాస్ సినిమాలో న‌టిస్తోంది. అఖిల్ సినిమాలోనూ త‌నే క‌థానాయిక‌. ఇప్పుడు మ‌రిన్ని ఆఫ‌ర్లు ఆమె చేతికి వ‌స్తున్నాయి. ఈ డిమాండ్ చూసి, త‌న పారితోషికాన్ని అమాంతం పెంచేసింద‌ని టాక్‌. మొన్న‌టి వ‌ర‌కూ త‌న పారితోషికం 1.5 నుంచి 1.75 కోట్లు ఉండేది. ఇప్పుడు ఏకంగా 2.5 కోట్ల‌కుపెంచేసింద‌ని టాక్‌. కాక‌పోతే డిమాండ్ ని బ‌ట్టే స‌ప్లై క‌దా. అందుకే.. అడిగినంత ఇవ్వ‌క త‌ప్ప‌డం లేదు.

ALSO READ: Pooja Hegde Latest Photoshoot