ENGLISH

Prudhvi Raj: నిండా మునిగిపోయిన ఫృథ్వీరాజ్‌

01 October 2022-10:00 AM

హాస్య న‌టుడు, థ‌ర్టీ ఇయ‌ర్స్ ఫృథ్వీరాజ్ ఇప్పుడు కోర్టు గొడ‌వ‌ల్లో నిండా మునిగిపోయారు. ఆయ‌న కుటుంబంలో చిన్న‌పాటి క‌ల‌త‌లు ఉన్నాయి. భార్య‌తో విబేధాలు కోర్టు వ‌ర‌కూ వెళ్లాయి. ఆయ‌న త‌న‌ భార్య శ్రీ‌ల‌క్ష్మితో విడాకులు తీసుకొన్నారు. త‌ను కోర్టుకెక్కారు. ఫృథ్వీ త‌న‌కు భ‌ర‌ణం చెల్లించాల‌ని కోర్టుకేసు వేశారు. దీనిపై విజ‌య‌వాడ కోర్టు తీర్పు నిచ్చింది. 2017లో వీరిద్ద‌రూ విడిపోయారు. అప్ప‌టి నుంచి నెల‌కు 8 ల‌క్ష‌ల చొప్పున భ‌ర‌ణం చెల్లించాల‌ని కోర్టు ఆదేశించింది.

 

ఇక మీదట ప్ర‌తీ నెలా 10 తేదీ లోపు భ‌ర‌ణంగా 8 ల‌క్ష‌లు చెల్లించాల‌ని ఆదేశించింది. అంటే... దాదాపు రూ.6 కోట్లు ఇప్పుడు క‌ట్టాల‌న్న మాట‌. అంత డ‌బ్బు ఫృథ్వీ ద‌గ్గ‌ర ఉందా? అనేది పెద్ద ప్ర‌శ్న‌. ఎందుకంటే.. పృథ్వీకి సినిమా అవ‌కాశాలు బాగా త‌గ్గిపోయాయి. ఇది వ‌ర‌క‌టిలా ఆయ‌న సినిమాలు చేయ‌డం లేదు. కాబ‌ట్టి... ఆరు కోట్లు ఎరియర్స్ క‌ట్ట‌డం దాదాపుగా అసాధ్య‌మ‌ని తెలుస్తోంది. దాంతో పృథ్వీ పై కోర్టుకు వెళ్లే అవ‌కాశాలు క‌నిపిస్తున్నాయి. అందుకు ఆయ‌న త‌న లాయ‌ర్ ని సంప్ర‌దించిన‌ట్టు.. తెలుస్తోంది.

ALSO READ: తొలి రోజే వ‌సూళ్లు తేడా కొట్టేలా ఉన్నాయ్‌