ENGLISH

SIT విచారణ తరువాత నోరువిప్పిన పూరి జగన్నాధ్

20 July 2017-00:08 AM

సుమారు 11గంటలు పాటు సిట్ అధికారుల విచారణని ఎదురుకున్న దర్శకుడు పూరి జగన్నాధ్ తన ఇంటికి చేరుకున్న తరువాత ఈ డ్రగ్స్ ఇష్యూ, ఇవాళ జరిగిన విచారణ క్రమం పైన తన స్పందన తెలియచేశాడు.

తన సోషల్ మీడియా ద్వారా ఒక వీడియో పోస్ట్ చేసిన పూరి, అందులో మాట్లాడుతూ- తాను ఇవ్వాళ SIT అధికారుల ముందు విచారణకి హాజరయ్యానని, వాళ్ళు అడిగిన ప్రతి ప్రశ్నకి తాను సమాధానం చెప్పిన్నట్టు తెలిపాడు.

ఇక తాను కెల్విని ని వ్యక్తిగతంగా ఎప్పుడు కలవలేదని అలాగే కెల్విన్ ముఠాతోఎటువంటి సంబంధం లేదు అని సంబంధిత అధికారులకి తెలియచేశానని చెప్పాడు. అధికారులు ఏ సమయంలో పిలిచినా వాళ్ళ ముందుకి వెళ్ళడానికి తాను సిద్ధమే అని తన జీవితంలో ఎన్నడు illegal పనులు చేయలేదని, ఇక ముందు కూడా చేయనని స్పష్టంచేశాడు.

ఈ మొత్తం ఎపిసోడ్ లో తనని బాగా బాధపెట్టింది మీడియా మిత్రులని తన భాధని వెలిబుచ్చాడు. తనకి పర్సనల్ గా చాలా మంది విలేఖర్లకి సన్నిహిత సంబంధాలు ఉన్నాయి అని అలాంటిది ఇలాంటి సమయంలో తన పైన వారి వారి ఛానల్స్ లో తెలిసి తెలియని విషయాలతో చేసిన షోస్ వల్ల అందరి జీవితాలు నాశనం చేశారు అని ఒకింత ఎమోషనల్ గా మాట్లాడాడు.

తన తల్లి, భార్య, పిల్లలు, కుటుంబసభ్యులు అంతా భాధలో మునిగిపోయారు అని తెలిపాడు. మీడియా అంటే తనకి చాలా గౌరవం అని అలాంటిది వారు తన పై ప్రవర్తించిన తీరు తనని చాలా డిస్ట్రబ్ చేసింది అని వాపోయాడు. చివరగా ఈ కేసుకి సంబంధించి ఏదైనా ఉంటే అది SIT అధికారులు డిసైడ్ చేస్తారు అని ముగించాడు.

ఈ వీడియో చూసిన ఎవ్వరికైనా పూరి జగన్నాధ్ మానసికంగా ఎంత కుంగిపోయడో అనేది అర్ధమవుతుంది.