ENGLISH

ముచ్చటగా మూడోసారి కిషోర్‌తో రామ్‌ 'దోస్తానా'.!

19 October 2019-11:00 AM

కిషోర్‌ తిరుమల, యంగ్‌ హీరో రామ్‌ కాంబినేషన్‌లో ఇప్పటికే రెండు సినిమాలొచ్చాయి. 'నేను శైలజ' బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అందుకుంది. ఆ తర్వాత వచ్చిన 'ఉన్నది ఒక్కటే జిందగీ' సినిమా ఫర్వాలేదనిపించింది. ఇప్పుడు ఈ కాంబినేషన్‌లో మరో మూవీ రానుందట. ఓ తమిళ రీమేక్‌ని రామ్‌తో తెరకెక్కించాలనుకుంటున్నాడట కిషోర్‌ తిరుమల. హిట్‌, ఫెయిల్యూర్‌ సంగతి పక్కన పెడితే, కిషోర్‌ తిరుమల తన సినిమాల్లో క్యారెక్టర్స్‌ పెయిన్‌ని ప్రేక్షకుడు చాలా దగ్గరగా ఫీలయ్యేలా ఏదో మ్యాజిక్‌ చేస్తాడు.

 

అదీ ఆయన టేకింగ్‌ స్పెషాలిటీ. సక్సెస్‌ సంగతి పక్కన పెట్టి, ఆ క్యారెక్టర్‌లో లీనమై ఫీలయ్యేందుకు సగటు ప్రేక్షకుడు ఇష్టపడతాడు. అయితే, ఈ సారి రీమేక్‌ మూవీని ఎంచుకున్నాడు. కానీ, రామ్‌ బాడీ లాంగ్వేజ్‌కి తగ్గట్లుగా క్యారెక్టర్‌నీ, కథనీ కొన్ని మార్పులు చేర్పులు చేయనున్నాడట. త్వరలో పూర్తి వివరాలు తెలియనున్నాయి. ఈ సినిమా కోసం హీరోయిన్‌గా 'నేల టిక్కెట్టు' భామని పరిశీలిస్తున్నారు. 'నేల టిక్కెట్టు' సినిమాలో క్యూట్‌ అండ్‌ హాట్‌గా ఎంట్రీ ఇచ్చిన ముద్దుగుమ్మ మాళవికా శర్మకు ఆ తర్వాత మరో అవకాశం రాలేదు. రామ్‌ రూపంలో రెండో ఛాన్స్‌ దక్కేలా ఉంది. చూడాలి మరి.

ALSO READ: 'ఆప‌రేష‌న్ గోల్డ్ ఫిష్‌' రివ్యూ & రేటింగ్!