ENGLISH

'ఆర్‌ఎక్స్‌' డైరెక్టర్‌ అదే ఫార్ములా కంటిన్యూ చేస్తాడా.?

15 August 2019-08:30 AM

 'ఆర్‌ ఎక్స్‌ 100' సినిమాతో సెన్సేషనల్‌ అయిన దర్శకుడు అజయ్‌ భూపతి. బోల్డ్‌ కంటెంట్‌ మూవీతో తెలుగులో భారీ వసూళ్లు రాబట్టాడీ యంగ్‌ డైరెక్టర్‌. 'ఆర్‌ ఎక్స్‌ 100' తర్వాత అజయ్‌ భూపతి మాస్‌ రాజా రవితేజను డైరెక్ట్‌ చేయబోతున్నాడన్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ప్రస్తుతం పోస్ట్‌ ప్రొడక్షన్‌ పనుల్లో బిజీగా ఉంది. అయితే, కొత్త హీరో, కొత్త హీరోయిన్‌ని తీసుకుని, తొలి సినిమాకి బీభత్సంగా శృంగార సన్నివేశాలు కుమ్మరించేశాడు మనోడు.

 

అయితే, మాస్‌ రాజాతో తెరకెక్కించబోయే సినిమాలో కూడా ఆ సీన్స్‌ రిపీట్‌ చేస్తాడా? కొత్త డైరెక్టర్ల సక్సెస్‌ సీక్రెట్‌ బోల్డ్‌ సన్నివేశాలే అన్నట్లుగా మారిపోయింది నేటి సినిమాల పరిస్థితి. కానీ, రవితేజ సీనియర్‌ హీరో. అందులోనూ రవితేజకు ఇదివరకటంత మార్కెట్‌ లేదిప్పుడు. అజయ్‌ భూపతి చూపించే స్థాయిలో రొమాంటిక్‌గా రవితేజని చూపించినా అభిమానులు అంత ఇష్టపడరు. అలాంటిది, ఈ రొమాంటిక్‌ డైరెక్టర్‌, రవితేజ కోసం ఎలాంటి కాన్సెప్ట్‌ సిద్ధం చేసి ఉంటాడయ్యా..అంటే ఆ విషయమై పలు రకాల గాసిప్స్‌ వినిస్తున్నాయి.

 

రవితేజతో ఓ వినూత్న సబ్జెక్ట్‌ని తెరకెక్కించబోతున్నాడనీ తెలుస్తోంది. పక్కా కమర్షియల్‌ ఎంటర్‌టైనర్‌ అట. కానీ, యాక్షన్‌ బ్యాక్‌ డ్రాప్‌లో ఉండబోతోందనీ తెలుస్తోంది. ఈ సినిమా కోసం రాశీఖన్నాని హీరోయిన్‌గా ఎంచుకునే ఆలోచన చేస్తున్నారట. ఆల్రెడీ రాశీఖన్నా - రవితేజ కాంబినేషన్‌లో 'బెంగాల్‌ టైగర్‌', 'టచ్‌ చేసి చూడు' చిత్రాలు తెరకెక్కిన సంగతి తెలిసిందే.

ALSO READ: 'సైరా' మేకింగ్‌ వీడియో వచ్చేసింది.`