ENGLISH

ర‌వితేజ ఓకే చెప్పేశాడు.. ఇక క్రాక్ ఓటీటీలోనే!

13 July 2020-14:02 PM

థియేట‌ర్లు మూత‌బ‌డ‌డంతో.. ఓటీటీవైపుకు చూస్తున్నారు నిర్మాత‌లు. మ‌రీ ముఖ్యంగా చిన్న సినిమాల‌కు, నిర్మాత‌ల‌కు ఓటీటీ ఓ క‌ల్ప‌త‌రువుగా క‌నిపిస్తోంది. పెద్ద సినిమాలు మాత్రం ఈ విష‌యంలో ఆచి తూచి అడుగు వేస్తున్నాయి. స్టార్ హీరోలు ఓటీటీకి నో చెబుతున్నారు. థియేట‌ర్లో విడుద‌లైనంత మైలేజీ, క్రేజీ ఓటీటీలో ఉండ‌వ‌ని వాళ్ల న‌మ్మ‌కం.

 

అయితే... కొంత‌మంది హీరోలు మాత్రం `ఓటీటీలో అయినా ఓకే` అంటూ స‌ర్దుకుపోతున్నార‌ని టాక్‌. ర‌వితేజ కూడా ఓటీటీ వైపు మొగ్గు చూపిస్తున్న‌ట్టు టాక్‌. ర‌వితేజ సినిమా `క్రాక్‌` ఇప్పుడు విడుద‌ల‌కు సిద్ధం అవుతోంది. ఈసినిమాకి ఓటీటీ ఆఫ‌ర్లు భారీగానే వ‌చ్చాయి. కానీ.. ఇప్ప‌టి వ‌ర‌కూ రవితేజ ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు ర‌వితేజ నిర్ణ‌యం మార్చుకున్న‌ట్టు స‌మాచారం. త‌న సినిమాని ఓటీటీలో విడుద‌ల చేసినా, త‌న‌కు అభ్యంత‌రం లేద‌ని నిర్మాత‌లు చెప్పేశాడ‌ట‌. దాంతో.. నిర్మాత‌లు ఓ ఓటీటీ సంస్థ‌తో ఒప్పందాలు చేసుకోవ‌డానికి రెడీ అవుతున్న‌ట్టు టాక్‌. దాదాపు 35 కోట్ల‌తో త‌యారైన సినిమా ఇది. ఓటీటీలో ఎంతిస్తారో? చూడాలి.

ALSO READ: చ‌ర‌ణ్ - మ‌హేష్‌... ఓ సినిమా!