ENGLISH

నా కొడుకుని అనవసరంగా ఇరికిస్తున్నారు: హీరో రవితేజ తల్లి

17 July 2017-13:25 PM

హైదరాబాద్ లో ఎప్పుడైతే డ్రగ్స్ రాకెట్ బయటపడిందో అప్పటినుండి ఆ రాకెట్ లో టాలీవుడ్ కి చెందిన ప్రముఖులు ఉన్నారు అంటూ కథనాలు మొదలయ్యాయి.

అవి చివరకి ఒక 12మందికి Excise Enforcement నుండి నోటిసులు అందాయి అంటూ వార్తలు గుప్పుమన్నాయి. ఆ 12 మందిలో హీరో రవితేజ కూడా ఉన్నట్టు రావడం అందరిని షాక్ కి గురిచేసింది. అయితే ఈ మధ్యనే తన తమ్ముడి మరణంతో రవితేజ వార్తల్లో నిలిచాడు, అంతలోనే డ్రగ్స్ కేసులో నోటిసులు అంటూ మళ్ళీ వార్తలు బయల్దేరాయి.

వీటన్నిటి పైన రవితేజ తల్లి రాజ్యలక్ష్మి స్పందించింది. తన కొడుకుని (రవితేజ)ని అనవసరంగా ఈ కేసులో ఇరికిస్తున్నారు అని అలాగేతన కొడుకుకి ఎటువంటి దురలవాట్లు లేవని చెప్పుకొచ్చింది. ఇప్పటికే తమ్ముడు పోయిన బాధని దిగమింగుకుని మరి షూటింగ్ చేస్తున్న తన కొడుకు పై ఇటువంటి ఆరోపణలు చేయడం సబబు కాదు అని తన భాధని వెలిబుచ్చారు. 

ఇక మీడియా లో వచ్చినట్టు తన కొడుకు భరత చనిపోయినప్పుడు మద్యం సేవించి లేడు అని, చనిపోయే కొన్ని నెలల ముందు నుండే దురలవాట్లని వదిలేశాడు అని చెప్పుకొచ్చింది.

 

ALSO READ: టాలీవుడ్‌లో డ్రగ్స్ కేసు: ఓ బ‌డా హీరో గ‌జ‌గ‌జ‌?