ENGLISH

సాయి ప‌ల్ల‌విని వ‌ద‌ల‌డా?

19 June 2021-11:30 AM

`ఫిదా`తో తెలుగు చిత్ర‌సీమ‌లో ఓ క‌థానాయిక మెరిసింది... త‌నే సాయి ప‌ల్ల‌వి. ఈ సినిమాతోనే శేఖ‌ర్ క‌మ్ముల - సాయి ప‌ల్ల‌విల బాండిగ్ మొద‌లైంది. ఆ వెంట‌నే... `ల‌వ్ స్టోరీ`లోనూ సాయి ప‌ల్ల‌వినే క‌థానాయిక‌గా ఎంచుకున్నాడు శేఖ‌ర్ క‌మ్ముల‌. ఇప్పుడు ముచ్చ‌ట‌గా మూడోసారి కూడా త‌న‌నే క‌థానాయిక‌గా తీసుకోబోతున్నాడ‌ట‌. శేఖ‌ర్ క‌మ్ముల ద‌ర్శ‌క‌త్వంలో, ధ‌నుష్ క‌థానాయ‌కుడిగా ఓ చిత్రం రూపుదిద్దుకోనున్న సంగ‌తి తెలిసిందే. తెలుగు, త‌మిళ‌, హిందీ భాష‌ల్లో ఈ చిత్రాన్ని ఒకేసారి తెర‌కెక్కిస్తారు.

 

ధ‌నుష్ న‌టించే తొలి తెలుగు చిత్ర‌మిదే. ఇందులో క‌థానాయిక‌గా సాయి ప‌ల్ల‌విని ఎంచుకున్నార‌ని తెలుస్తోంది. అదే నిజ‌మైతే శేఖ‌ర్ - సాయి కాంబో.. హ్యాట్రిక్ కొట్టేసిన‌ట్టే. ధ‌నుష్ తో సాయి ప‌ల్ల‌వి ఇది వ‌ర‌కు ఓ సినిమా చేసింది. వారిద్ద‌రి కాంబినేషన్ అదుర్స్ అని ఆ సినిమా నిరూపించింది. అందుకే.. శేఖ‌ర్ దృష్టి సాయి ప‌ల్ల‌విపై ప‌డింద‌ని తెలుస్తోంది. ఈ సినిమాపై సాయి పల్ల‌వి సంత‌కం చేస్తే.. తాను చేసే తొలి పాన్ ఇండియా ప్రాజెక్టు ఇదే అవుతుంది. మ‌రి సాయి ప‌ల్ల‌వి పేరుని ఎప్పుడు ఖ‌రారు చేస్తారో చూడాలి.

ALSO READ: 'ఇన్ ద నేమ్ ఆఫ్ గాడ్‌' రివ్యూ & రేటింగ్