ENGLISH

సూపర్‌ స్టార్‌తో 'శృతి' కలపనుందా.?

12 December 2019-12:14 PM

సూపర్‌ స్టార్‌తో శృతిహాసన్‌ జోడీ కట్టనుందా.? అంటే, అవునంటున్నాయి టాలీవుడ్‌ వర్గాలు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో మహేష్‌బాబు నటించబోయే సినిమాలో హీరోయిన్‌గా శృతిహాసన్‌ పేరు తెరపైకి వచ్చింది. 'సరిలేరు నీకెవ్వరూ..' సినిమా తర్వాత మహేష్‌బాబు, వంశీ పైడిపల్లితో సినిమా చేయనున్నారన్న సంగతి తెలిసిందే. 'సరిలేరు..' పూర్తయిన వెంటనే ఈ సినిమాని పట్టాలెక్కించనున్నాడట మహేష్‌బాబు.

 

గతంలో వంశీ పైడిపల్లి తెరకెక్కించిన 'ఎవడు' చిత్రంలో శృతి హీరోయిన్‌గా నటించింది. ఈ సినిమా మంచి విజయం అందుకుంది. అలాగే, మహేష్‌తో 'శ్రీమంతుడు' సినిమాలో నటించింది. ఈ సినిమా బ్లాక్‌ బస్టర్‌ హిట్‌ అయ్యింది. సో ఆ సెంటిమెంట్‌తోనే వంశీ పైడిపల్లి - మహేష్‌ కాంబినేషన్‌ ప్రాజెక్ట్‌లో శృతిని భాగం చేయనున్నట్లు తెలుస్తోంది. చిన్న బ్రేక్‌ చిటికెలో వచ్చేస్తా.. అన్నట్లుగా ఈ మధ్య శృతిహాసన్‌ సినిమాలకు బ్రేక్‌ ఇచ్చిన సంగతి తెలిసిందే. తమిళంలో 'లాభం' సినిమాతో తిరిగి రీ ఎంట్రీ ఇచ్చింది. తెలుగులో ఆల్రెడీ రవితేజ సరసన 'క్రాక్‌' మూవీలో నటిస్తోంది. ఒకవేళ మహేష్‌ ప్రాజెక్ట్‌ సెట్‌ అయితే, మళ్లీ శృతిహాసన్‌ కెరీర్‌ పట్టాలెక్కేసినట్లే.

ALSO READ: ముగ్గురు తాగుబోతుల గోల‌