ENGLISH

సూర్యతో సీత.. కాంబో అదుర్స్

23 October 2024-16:33 PM

కోలీవుడ్ స్టార్ హీరో సూర్య ప్రస్తుతం 'కంగువ' మూవీతో సందడి చేసేందుకు సిద్ధంగా ఉన్నాడు. బ్యాక్ టూ బ్యాక్ సినిమాలు చేసే సూర్య ఈ మధ్య కంగువా సినిమా కోసమే ఎక్కువ టైం కేటాయించి లాక్ అయిపోయాడు. దీనితో ఆ లాస్ ని ఇప్పుడు కంప్లీట్ చేసే పనిలో ఉన్నాడు. అందుకే వరుస సినిమాలు ఒప్పుకుంటున్నాడు. కంగువా తరువాత సూర్య ఆర్జే బాలాజీ దర్శకత్వంలో ఓ సినిమా చేయటానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. #Suriya45 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ ప్రాజెక్ట్ ను రీసెంట్ గా మేకర్స్ అనౌన్స్ చేసారు. ప్రజంట్ ప్రీ ప్రొడక్షన్  వర్క్ జరుగుతోంది, త్వరలో సెట్స్ మీదకు వెళ్లనుందని సమాచారం. 


'కరుప్పు' 'హింట్' అనే టైటిల్స్ పరిశీలనలో ఉన్నట్లు తెలుస్తోంది. యాక్షన్ ఎంటర్ టైనర్స్, కమర్షియల్ సినిమాలు చేసే సూర్య మధ్యలో 'ఆకాశమే నీ హద్దు' 'జై భీం' లాంటి మెసేజ్ ఓరియెంటెడ్ మూవీస్ కూడా చేసాడు. ఇపుడు కంగువాతో విభిన్నంగా వస్తున్నాడు. నెక్స్ట్ ఆర్జె  బాలాజీతో చేయబోయే సినిమా ఆధ్యాత్మిక జోనర్ లో ఉంటుందని, ఒక డివోషనల్ ఫాంటసీ ఎంటర్‌టైనర్ అని టాక్. ప్రజంట్ డివోషనల్ మూవీస్ కి ఆదరణ పెరగటంతో మార్కెట్ కూడా పెరిగింది. వీటిని దృష్టిలో పెట్టుకుని సూర్య ఈ మూవీకి కమిట్ అయినట్లు తెలుస్తోంది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ సినిమాలో సూర్య సరసన నటించే హీరోయిన్ ఫిక్స్ అయిందని తెలుస్తోంది. 


ఈ మూవీలో ఇద్దరు హీరోయిన్స్ ఉంటారని తెలుస్తోంది. ఇప్పటికి ఒక హీరోయిన్ గా సీతా రామం బ్యూటీ మృణాల్ ఠాకూర్ ఫిక్స్ అయినట్లు సమాచారం. మృణాల్ ఇప్పటివరకు తమిళంలో నటించలేదు. సూర్యతో మృణాల్ తమిళంలో గ్రాండ్ ఎంట్రీ ఇవ్వనుంది. ఈ మూవీ హిట్ అయితే మృణాల్ సౌత్ లో మరిన్ని ఆఫర్స్ అందుకుంటుందేమో చూడాలి. సెకండ్ హీరోయిన్ కోసం 'సప్త సాగరాలు దాటి' ఫేమ్ కన్నడ హీరోయిన్  రుక్మిణి వసంత్ ని సంప్రదించినట్లు తెలుస్తోంది. ఇంకో పాత్రలో కశ్మీరా పరదేశి కూడా కనిపిస్తోందని టాక్. ఈ సినిమాకి ఏఆర్‌ రెహమాన్‌ సంగీతం అందిస్తున్నారు. 2025 సెకండాఫ్ లో ఈ చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది.