ENGLISH

'చినబాబు'ను మెచ్చుకున్న వెంకయ్య నాయుడు

17 July 2018-11:50 AM

ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు 'చినబాబు' సినిమాని మెచ్చుకున్నారు. తాజాగా ఈ చిత్రాన్ని చూసిన వెంకయ్యనాయుడు సినిమా చాలా బాగుందంటూ ప్రశంసల వర్షం కురిపించారు. చక్కని కుటుంబ కథా చిత్రం 'చినబాబు' అని చిత్ర యూనిట్‌ని అభినందించారు. 

చాలా కాలం తర్వాత ఈ సినిమా చూశాననీ, వ్యవసాయం మెయిన్‌ కాన్సెప్ట్‌గా తెరకెక్కిన ఈ సినిమాలో కార్తి రైతు పాత్రలో నటించాడు. ఫ్యామిలీ ఎమోషన్స్‌కి పెద్ద పీట వేశారు. 'ఈ మధ్య సినిమాలు చూడాలంటే చాలా ఇబ్బందికరంగా ఉంటోంది. ఫ్యామిలీతో కలిసి చూడదగ్గ చిత్రాలు రావడం లేదిప్పుడు. అశ్లీలతకు తావు లేని చిత్రంగా చినబాబును చక్కగా అందంగా తెరకెక్కించారు. అందుకే 'చినబాబు' చిత్రం తన మనసుకు నచ్చింది..' అని వెంకయ్యనాయుడు సోషల్‌ మీడియా ద్వారా స్పందించారు. 

గతంలో వెంకయ్యనాయుడు, కీర్తి సురేష్‌ నటించిన 'మహానటి' చిత్రాన్ని కూడా ఇదే విధంగా ప్రశంసించారు. ఆ తర్వాత అలాంటి ప్రశంసలు 'చినబాబు' సినిమాకు దక్కడం విశేషం. పాండి రాజ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ చిత్రంలో 'అఖిల్‌' బ్యూటీ సాయేషా సైగల్‌ హీరోయిన్‌గా నటించింది. 

తమిళ హీరో కార్తి మరోసారి తెలుగులో 'చినబాబు' సినిమాతో తనదైన ముద్ర వేశాడు.

ALSO READ: 'ఆ' జాగ్రత్తలు నాకు తెలుసు: శ్రీరెడ్డి