ENGLISH

రీ ఎంట్రీ ఇస్తున్న పూరి హీరోయిన్‌

26 March 2021-14:00 PM

వెట‌ర‌న్ క‌థానాయిక‌ల రీ ఎంట్రీకి ఇది స‌రైన స‌మ‌యం అనిపిస్తోంది. ఎందుకంటే ఓ టీ టీ వేదిక‌ల‌పై వెబ్ సిరీస్‌లు, వెబ్ మూవీలూ వ‌రుస క‌డుతున్నాయి. వాళ్ల‌కు స్టార్స్ అవ‌స‌రం ఉంది. అందుకే క‌నుమ‌రుగైపోయిన తార‌ల‌కూ.. మ‌ళ్లీ కుప్ప‌లు తెప్ప‌లుగా అవ‌కాశాలొస్తున్నాయి. సినిమాలూ వాళ్ల‌కు స్వాగ‌తం ప‌లుకుతున్నాయి. తాజాగా.. శియా గౌత‌మ్ కూడా తెలుగులో రీ ఎంట్రీ ఇస్తున్న‌ట్టు తెలుస్తోంది.

 

పూరి జ‌గ‌న్నాథ్ `నేనింతే`లో హీరోయిన్ గా న‌టించింది శియా. ఆ త‌ర‌వాత ఒక‌ట్రెండు సినిమాలు చేసింది. స‌రైన బ్రేక్ రాలేదు. దాంతో శియాని మ‌ర్చిపోయారు. ఇప్పుడు మ‌ళ్లీ.. ఇంత కాలానికి ఓ తెలుగు సినిమాలో ఛాన్స్ వ‌చ్చింది. గోపీచంద్ `ప‌క్కా క‌మ‌ర్షియ‌ల్` లో శియాకి ఓ కీల‌క‌మైన పాత్ర దొరికిన‌ట్టు తెలుస్తోంది. దీంతో పాటు ఓ వెబ్ మూవీలోనూ తాను న‌టిస్తోంద‌ట‌. మొత్తానికి పూరి పోరికి.. మ‌ళ్లీ ఛాన్సులొస్తున్నాయి. ఈసారైనా నిల‌బెట్టుకుంటుందో లేదో..?

ALSO READ: 'అర‌ణ్య' మూవీ రివ్యూ & రేటింగ్!