ENGLISH

సామ్ అలా... నయన్ ఇలా..

30 July 2024-18:51 PM

మొన్న సమంత నిన్న నయన తార ఒకేలాంటి వివాదంలో చిక్కుకున్నారు. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా వెలుగుతున్న నయన్ సోషల్ మీడియాకి దూరంగా ఉంటుంది. అసలు సోషల్‌ మీడియాలోకి చాలా లేట్ గా అడుగుపెట్టింది. అయినా కానీ ఇన్‌స్టాగ్రామ్ లో ఒక ఏడాదిలోనే  8.7 మిలియన్ల ఫాలోవర్స్ ని సంపాదించుకుంది. ఇన్‌స్టాలో ఎప్పటికప్పుడు తన సినిమా సంగతులు, వ్యక్తిగత విషయాలను, విగ్నేష్ తో, పిల్లల్తో స్పెండ్ చేసిన మూమెంట్స్ ని షేర్ చేస్తూ ఉంటుంది. ఈ మధ్య డైలీ టచ్ లో ఉంటోంది. ఈ క్రమంలోనే 'మందార పువ్వుతో చేసిన టీ' వలన చాలా  ప్రయోజనాలు ఉన్నాయని పోస్ట్ పెట్టింది.  


మందార పువ్వులతో చేసిన టీ అంటే తనకిష్టమని, దాని వల్ల ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని, రోగ నిరోధక శక్తి పెంపు, మధుమేహం, అధిక రక్తపోటు, గుండె సంబంధిత సమస్యలు ఉన్నవారికి ఇది మంచి ఉపశమనం కలిగిస్తుందని పోస్ట్ పెట్టగా ఈ పోస్ట్ పై ఓ ది లివర్‌ డాక్టర్‌ అనే ఎక్స్‌ ఖాతాలో ఓ డాక్టర్ పోస్ట్‌ పెడుతూ 8.7 మిలియన్ల మంది ఫాలోవర్స్‌కి  నయనతార తప్పుడు సలహాలు ఇస్తోందని ఆవేశపడ్డాడు. ఇది వైరల్ అవటంతో నయన్ అనవసర ఆర్గ్యుమెంట్ ఎందుకని ఆ పోస్ట్ ని  డిలీట్ చేసింది. 
 

ఆ మధ్య సామ్ కూడా నెబిలైజర్ గూర్చి పోస్ట్ చేసి డాక్టర్స్ విమర్శలకి గురి అయింది. కానీ వారికి ధీటుగా రిప్లై ఇచ్చి వారితో సారీ చెప్పించుకుంది. కానీ నయన్ మాత్రం 'తెలివి తక్కువ వారితో ఎప్పుడూ వాదించకండి. వారు మిమ్మల్ని క్రిందికి లాగి వారి స్థాయికి తీసుకెళ్తారు. వారి అనుభవంతో మిమ్మల్ని ఓడిస్తారు' అని అమెరికన్‌ రైటర్‌ మార్క్ ట్వైన్ చెప్పిన కొటేషన్ పోస్ట్ చేసింది. మొదట తగ్గి పోస్ట్ డిలీట్ చేసిన నయన తార మళ్ళీ ఎవరిని ఉద్దేశించి ఈ పోస్ట్ పెట్టింది అని జోరుగా చర్చ నడుస్తోంది. తన పోస్ట్ పై  విమర్శించిన వారిని ఉద్దేశించే నయన్ ఈ పోస్ట్ అని కామెంట్స్ వినిపిస్తున్నాయి.