ENGLISH

‘ఇండియన్‌ 2’ యాక్సిడెంట్‌పై రెస్పాండ్‌ అయిన బన్నీ.!

21 February 2020-13:00 PM

ప్రతిష్ఠాత్మక చిత్రం ‘ఇండియన్‌ 2’ సెట్స్‌లో జరిగిన క్రేన్‌ ప్రమాదం అందర్నీ కలిచి వేసింది. పలువురు సెబ్రిటీలు ఈ యాక్సిడెంట్‌ పట్ల ట్విట్టర్‌లో స్పందించారు. తమ ప్రగాఢ సానుభూతిని తెలిపారు. తాజాగా స్టైలిష్‌ స్టార్‌ అల్లు అర్జున్‌ ఈ యాక్సిడెంట్‌ పట్ల తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.‘ ఇది చాలా భయంకరమైన సంఘటన.. చనిపోయిన వారి ఆత్మకు శాంతి చేకూరాలని ఆశిస్తున్నాను..’ అంటూ ట్విట్టర్‌లో తెలిపారు.

మరోవైపు ఈ సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్న కాజల్‌ అగర్వాల్‌ కూడా ట్విట్టర్‌లో స్పందించారు. ‘నేను సజీవంగానే ఉన్నాను.. అన్నందుకు సాక్ష్యంగా ఈ పోస్ట్‌ టైప్‌ చేస్తున్నాను. కొన్ని సెకన్లు తేడాలో ఈ భయంకరమైన ప్రమాదం నుండి నేను తప్పించుకోగలిగాను..’ అంటూ, కాజల్‌ ఆవేదన వ్యక్తం చేసింది. మానిటర్‌లో సీన్‌ చెక్‌ చేసుకుని అప్పుడే అక్కడి నుండి పక్కకి వెళ్లిన కాజల్‌, తృటిలో ఈ ప్రమాదం నుండి భయపడిందట. కళ్ల ముందరే రెప్ప పాటులో తన సహచరుల్ని కోల్పోయిన కాజల్‌ తీవ్రమైన షాక్‌కి గురయ్యిందట. నిజంగానే చాలా భయంకరమైన ఘటన ఇది. శంకర్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ మధ్యనే సెట్స్‌పైకి వెళ్లింది. ఇంతలోనే ఇలా జరగడం విషాదకరం. ఈ ఘటన పట్ల ఆరా తీసిన పోలీసులు నిర్మాణ సంస్థ లైకా ప్రొడక్షన్స్‌పై కేసు నమోదు చేశారు.

ALSO READ: ఉమామహేశ్వర ఉగ్రరూపస్య.. టీజర్‌ రివ్యూ