ENGLISH

ఫ్రస్టేషన్‌ నుండి రిలాక్స్‌డేషన్‌లోకి.!

07 September 2018-11:48 AM

విక్టరీ వెంకటేష్‌, మెగా ప్రిన్‌ వరుణ్‌ తేజ్‌ ఇద్దరూ ఇంట్లో ఫ్రస్టేషన్‌ తట్టుకోలేకపోతున్నారట. అందుకే అలా సరదాగా ఔటింగ్‌కి వెళ్లాలనుకున్నారు. అయితే వీళ్లేం బ్యాచిలర్స్‌ కాదండోయ్‌. పెళ్లిళ్లయిపోయాయ్‌. మరి పెళ్లాలు ఊరుకుంటారా? అందుకే వాళ్లతో పాటే టూర్‌ ప్లాన్‌ చేశారు. రిపబ్లిక్‌ దేశం ప్రాగ్‌లో సందడి మొదలెట్టేశారు. ఏంటీ స్టోరీ అనుకుంటున్నారా? 

వెంకీ, వరుణ్‌ కాంబినేషన్‌లో మల్టీ స్టారర్‌ రూపొందుతోన్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో వెంకీకి జోడీగా మిల్కీ బ్యూటీ తమన్నా, వరుణ్‌కి జోడీగా మెహ్రీన్‌ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ప్రాగ్‌లో జరుగుతోంది. ఈ షూటింగ్‌లో భాగంగా ఈ జంట ప్రాగ్‌లో సందడి సందడి చేశారు. ఆ ఫోటోలు సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నాయి. రెండు జంటలూ భలే రిలాక్స్‌డ్‌ మూడ్‌లో కనిపిస్తున్నాయి. ఫుల్‌ ఖుషీగా ఉన్నాయి. 

ఫ్రస్టేషన్‌ అంతా మర్చిపోయి హాయిగా ఎంజాయ్‌ చేస్తున్నారు. పది రోజుల పాటు సాగే ఈ షెడ్యూల్‌లో కొన్ని ఇంపార్టెంట్‌ సీన్స్‌తో పాటు, రెండు సాంగ్స్‌ కూడా షూట్‌ చేయనున్నారట. అనిల్‌ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాను వేంకటేశ్వర సినిమాస్‌ బ్యానర్‌లో దిల్‌రాజు నిర్మిస్తున్నారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందిస్తున్నాడు. వచ్చే ఏడాది సంక్రాంతికి ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: కేరాఫ్ కంచ‌ర‌పాలెం మూవీ రివ్యూ & రేటింగ్