ENGLISH

గోపీచంద్‌తో చందమామ.!

28 July 2018-12:52 PM

టాలీవుడ్‌లో వన్‌ ఆఫ్‌ ది స్టార్‌ హీరోయిన్‌ కాజల్‌ అగర్వాల్‌. దాదాపు 15 ఏళ్లుగా తెలుగు ఇండస్ట్రీని క్వీన్‌లాగే ఏలుతోంది కాజల్‌ అగర్వాల్‌. తెలుగుతో పాటు, తమిళ, హిందీ భాషల్లోనూ మంచి చిత్రాలను ఎంచుకుంటూ, ప్రణాళికాబద్దంగా కెరీర్‌ని బిల్డప్‌ చేసుకుంటోంది. ఇటీవల కళ్యాణ్‌రామ్‌తో 'ఎమ్మెల్యే' చిత్రంలో నటించిన కాజల్‌, తాజాగా తెలుగులో ఓ కొత్త ప్రాజెక్టుపై సైన్‌ చేసిందట. ఆరడుగుల ఆజానుబాహుడు గోపీచంద్‌ నటిస్తున్న చిత్రంలో కాజల్‌ హీరోయిన్‌గా ఎంపికైందని తెలుస్తోంది. 

గతంలో గోపీచంద్‌ నటించిన 'మొగుడు' చిత్రంలో కాజల్‌ నటించాల్సి ఉంది. ఆ చిత్ర యూనిట్‌ అప్పట్లో 'మొగుడు' కోసం హీరోయిన్‌గా కాజల్‌ అగర్వాల్‌ని సంప్రదించారట. అయితే కాజల్‌ నో చెప్పడంతో తాప్సీని తీసుకున్నారట. అలా గోపీచంద్‌తో కాజల్‌ నటించే అవకాశాన్ని అప్పుడు మిస్‌ అయ్యింది. మళ్లీ ఇన్నాళ్లకు ఈ కాంబినేషన్‌ సెట్‌ కానుందని తెలుస్తోంది. కుమార్ దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కుతోంది. 

ప్రస్తుతం కాజల్‌ అగర్వాల్‌ తెలుగులో యంగ్‌ హీరో బెల్లంకొండ శ్రీనివాస్‌ సరసన ఓ సినిమాలో నటిస్తోంది. కొత్త డైరెక్టర్‌ శ్రీనివాస్‌ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నాడు. ఆల్రెడీ తమిళంలో కాజల్‌ అగర్వాల్‌ నటిస్తున్న బాలీవుడ్‌ క్వీన్‌ రీమేక్‌ చిత్రీకరణ దాదాపు చివరి దశకు చేరుకుంది. 'ప్యారిస్‌ ప్యారిస్‌' టైటిల్‌తో ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. క్వీన్‌ పాత్ర కోసం కాజల్‌లో డిఫరెంట్‌ మేకోవర్‌ కనిపిస్తోంది. త్వరలోనే 'ప్యారిస్‌ ప్యారిస్‌' ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: పుట్టినరోజు పార్టీ లో మహేష్-తారక్-చరణ్..!