ENGLISH

Balakrishna: బాలయ్య కోసం జైలుకి వెళ్ళిన దర్శకుడు

09 January 2023-09:31 AM

నందమూరి బాలకృష్ణ కథానాయకుడిగా, గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కుతున్న మోస్ట్ అవైటెడ్ మూవీ 'వీరసింహారెడ్డి'. శ్రుతి హాసన్ కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నిర్మాతలు నవీన్ యెర్నేని, వై రవిశంకర్ భారీగా నిర్మిస్తున్నారు. ప్రేక్షకులు ఎంతగానో ఎదురుచూస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుకగా ఈ నెల 12న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్‌గా విడుదల కాబోతుంది. ఈ నేపధ్యంలో వీరసింహారెడ్డి చిత్ర యూనిట్ లో ఒంగోలులో మాసీవ్ ప్రీరిలీజ్ ఈవెంట్ ని చాలా గ్రాండ్ గా నిర్వహించింది.

 

ఈ ఈవెంట్ లో దర్శకుడు గోపీచంద్ మలినేని ఒక ఆసక్తికరమైన సంగతి చెప్పారు. '1999లో ఇదే ఒంగోలులో సమరసింహా రెడ్డి సినిమా చూడటానికి ఒక అభిమానిలా వెళ్ళా. అక్కడ చిన్న గొడవ జరిగితే రెండు పీకి తీసుకెళ్ళి లోపలేశారు. ఆ సంక్రాంతికి సినిమా ఫస్ట్ షో మిస్ అయిపోయానని చాలా బాధపడ్డ. నైట్ షో చూసి ఇంటికి వెళ్ళిన తర్వాతే ప్రశాంతంగా పడుకున్నా. ఆలాంటి ఒక బాలయ్య బాబు ఫ్యాన్.. ఈ రోజు బాలయ్య బాబు సినిమాని డైరెక్ట్ చేసాడంటే జీవితంలో ఇంతకంటే ఏం కావాలి. ఒక మాస్ గాడ్ ని డైరెక్ట్ చేసే అవకాశం అందరికీ రాదు. బాలకృష్ణ గారిది బంగారు మనసు. ఈ సినిమా చేస్తున్నప్పుడు ఒక కంటితో దర్శకుడిగా మరో కంటితో అభిమానిగా ఆయన్ని చూశాను. ఫ్యాన్స్ కోరుకునే విధంగా ఆయన్ని ప్రజంట్ చేయాలని ప్రతి క్షణం అలోచించాను. ఈ ప్రయాణం జీవితంలో మర్చిపోలేను'' అన్నారు గోపిచంద్ మలినేని.