ENGLISH

చింపాంజితో అర్జున్‌రెడ్డి బ్యూటీ ముద్దు ముచ్చట్లు!

31 May 2019-13:00 PM

'అర్జున్‌రెడ్డి' సినిమాతో పాపులర్‌ అయిన ముద్దుగుమ్మ షాలినీ పాండే ప్రస్తుతం సో బిజీగా గడిపేస్తోంది. ఇటు తెలుగులోనూ, అటు తమిళంలోనూ కూడా బిజీగా ఉందీ ముద్దుగుమ్మ. తమిళంలో జీవా హీరోగా తెరకెక్కుతోన్న 'గొరిల్లా' చిత్రం త్వరలో విడుదలకు సిద్ధంగా ఉంది. ఈ సినిమాలో చింపాంజి పాత్ర కీలకమైనది. విదేశాల నుండి తీసుకొచ్చిన ప్రత్యేకమైన చింపాంజితో ఈ సినిమా చిత్రీకరణ జరిపారు. మామూలు కమర్షియల్‌ సినిమాల్లో నటించడం కన్నా, ఇలా డిఫరెంట్‌ కంటెంట్‌ ఉన్న సినిమాల్లో నటించడం ఓ కొత్త ఎక్స్‌పీరియన్స్‌ ఇచ్చిందంటోంది షాలినీ పాండే.

 

మొదట్లో చింపాంజితో కలిసి నటించడమంటే భయం వేసిందట. కానీ, తర్వాత అలవాటైపోయిందట. ఎంతలా అంటే, చిత్రీకరణ పూర్తయ్యాక ఆ చింపాంజిని మర్చిపోలేనంతగా. ఎప్పుడో చిన్నప్పుడు ఇలా జంతువుల సినిమాలు చూసి ఆనందించేదాన్ననీ, ఇప్పుడు స్వయంగా తానే ఓ గొరిల్లాతో కలిసి స్క్రీన్‌ షేర్‌ చేసుకోవడం ఎంతో బాగుందనీ చెబుతోంది షాలినీ పాండే. మరోవైపు అనుష్క, మాధవన్‌ కాంబినేషన్‌లో తెరకెక్కుతోన్న 'సైలెన్స్‌' అనే సైన్స్‌ ఫిక్షన్‌ మూవీలోనూ షాలినీ పాండే నటిస్తోంది. దీంతో పాటు, మరిన్ని కొత్త ప్రాజెక్టులు షాలినీ చేతిలో ఉన్నాయి. ఇంకొన్ని చర్చల దశలో ఉన్నాయి. వరుస సినిమాలతో ఇంత బిజీగా ఉండడానికి కారణం తన తొలి సినిమా 'అర్జున్‌రెడ్డి'నే అంటోంది. ఎన్ని సినిమాల్లో నటించినా, 'అర్జున్‌ రెడ్డి' తన కెరీర్‌కి వెరీ వెరీ స్పెషల్‌ అంటోంది అందాల షాలినీ పాండే.

ALSO READ: ఆ డైరెక్టర్‌ అంతలా ఎమోషన్‌ అయ్యారెందుకబ్బా!