ENGLISH

ఓటు హక్కు వినియోగించుకున్న ఎన్టీఆర్‌ ఏమన్నారంటే.!

07 December 2018-15:59 PM

జూబ్లీహిల్స్‌ పోలింగ్‌ బూత్‌ వద్ద జూనియర్‌ ఎన్టీఆర్‌ స్పెషల్‌ అట్రాక్షన్‌గా నిలిచారు. తల్లి, భార్యతో కలిసి క్యూ లైన్‌లో కొంచెం టైం నిలబడి ఆయన తన ఓటు హక్కును వినియోగించుకోవడం విశేషం. ప్రతీ ఒక్కరూ ఓటు హక్కును వినియోగించుకోవాలి. ఇది రాజ్యాంగం, దేశం మనకు ఇచ్చిన హక్కు. ఓటు వేయకపోతే ప్రశ్నించే హక్కు మనకు లేదు.. అంటూ అందర్నీ ఓటు హక్కు వినియోగించుకోవాలని ఆయన కోరారు. క్యూ లైన్‌లో నిలబడిన ఎన్టీఆర్‌తో ఫోటోలు, సెల్ఫీలు దిగేందుకు పలువురు అభిమానులు పోటెత్తారు.

 

వారందరికీ కెమెరాలకు పోజిస్తూ ఎన్టీఆర్‌ తన ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఈ ఎలక్షన్స్‌లో భాగంగా అక్క సుహాసిని తరపున ఎన్టీఆర్‌ ప్రచారానికి దిగుతారని కొందరు భావించారు. కానీ కుదరలేదు. ఓటు హక్కు వినియోగించుకున్న తర్వాత చివరిగా తన అక్క సుహాసిని గెలవాలని కోరుకుంటున్నానని ఎన్టీఆర్‌ తెలిపారు. ప్రస్తుతం ఎన్టీఆర్‌ 'ఆర్ఆర్ఆర్‌' మూవీలో నటిస్తున్నారు.

 

లేటెస్టుగా ఫస్ట్‌ షెడ్యూల్‌ షూటింగ్‌ కంప్లీట్‌ చేసుకున్న 'ఆర్ఆర్ఆర్‌' సెకండ్‌ షెడ్యూల్‌కి ముస్తాబవుతోంది. ఇకపోతే ఎన్టీఆర్‌ని లైవ్‌గా చూసిన అభిమానులు ఆనందం మాటల్లో చెప్పలేనిది. ఇటీవల 'ఆర్ఆర్ఆర్‌' సినిమాలోని ఎన్టీఆర్‌ క్యారెక్టర్‌కి సంబంధించిన పిక్స్‌ అంటూ కొన్ని పిక్స్‌ హల్‌చల్‌ చేశాయి. వాటిలో ఎన్టీఆర్‌ బొద్దుగా కనిపించాడు. కానీ ఈ రోజు పోలింగ్‌ బూత్‌ వద్ద నార్మల్‌గానే కనిపించాడు ఎన్టీఆర్‌. 

ALSO READ: 'క‌వ‌చం' మూవీ రివ్యూ & రేటింగ్