ENGLISH

రావణ ఎన్టీయార్‌ న భూతో న భవిష్యతి

07 July 2017-11:49 AM

ఎన్టీఆర్‌ ట్రిపుల్‌ రోల్‌లో తెరకెక్కుతోన్న చిత్రం 'జై లవకుశ'. ఈ సినిమా అనుకున్నప్పట్నుంచీ అంచనాలు భారీగా ఉన్నాయి. నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మాణంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తున్న ఈ సినిమా టీజర్‌ విడుదలైంది. ఎన్టీఆర్‌ నెగిటివ్‌ రోల్‌తో టీజర్‌ని విడుదల చేశారు. అసుర..అసుర..అసురా.. అంటూ టీజర్‌ స్టార్ట్‌ అవుతోంది. సినిమాలో 'జై' పాత్ర నెగెటివ్‌ రోల్‌. బ్యాక్‌ గ్రౌండ్‌ మ్యూజిక్‌, సెట్టింగ్స్‌ భారీగా కనిపిస్తున్నాయి. 'ఆ రావణాసురుణ్ణి సంపాలంటే సముద్రం దాటాల.. ఈ రావణాసురుణ్ణి సంపాలంటే సముద్రమంత ధైర్యం ఉండాల..' అని ఎన్టీఆర్‌ చెబుతున్న డైలాగ్‌కి రోమాలు నిక్కబొడుచుకుంటున్నాయ్‌. ఎన్టీఆర్‌ నెగిటివ్‌ రోల్‌లో అదుర్స్‌ అనిపిస్తున్నాడు. స్వర్గీయ ఎన్టీయార్‌ గుర్తుకొచ్చారు అందరికీ 'జై' పాత్ర టీజర్‌ చూశాక. ధ..ధ..ధైర్యం ఉండాల అన్నట్లుగా నత్తితో డైలాగ్‌ చెబుతున్నాడు ఎన్టీఆర్‌. నెగిటివ్‌ రోల్‌ని ముందుగా రిలీజ్‌ చేసి అంతా షాక్‌ అయ్యేలా చేసింది చిత్ర యూనిట్‌. ఈ టీజర్‌కి ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌ ఫుల్‌ ఖుషీ అవుతున్నారంతే. ఎన్టీఆర్‌ చూపుల్లో రౌద్రం, గొంతులో గాంభీర్యం అన్నీ ఈ క్యారెక్టర్‌ని ఎక్కడికో తీసుకెళ్లేలా ఉన్నాయి. రీ రికార్డింగ్‌ దద్దరిల్లిపోతోంది. మిగిలిన రెండు గెటప్స్‌నీ కూడా ఇలాగే ఒక్కొక్కటిగా విడుదల చేయనున్నారట. బాబీ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో రాఖీ ఖన్నా, నివేదా థామస్‌ హీరోయిన్లుగా నటిస్తున్నారు. కళ్యాణ్‌ రామ్‌ ఈ చిత్రానికి నిర్మాత. తమ్ముడితో నిర్మాతగా 'జై లవ కుశ' సినిమాతో ఇండస్ట్రీ హిట్‌ కొట్టేలా ఉన్నఆడు కళ్యాణ్‌రామ్‌. దసరా కానుకగా సెప్టెంబర్‌ 21న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. 

 

ALSO READ: మళ్ళీ మొదలవనున్న థియేటర్లు