ENGLISH

సినిమాలకి స్వస్తి చెప్తున్న కంగనా?

06 August 2024-21:15 PM

నిత్యం వార్తల్లో నిలిచే బాలీవుడ్ ఫైర్ బ్రాండ్ ప్రస్తుతం తన ఆస్తులని అమ్మకానికి పెట్టిందట. అవును వినటానికి ఈ విషయం నమ్మశక్యంగా లేకపోయినా ఇది నిజం. ఎలాంటి బ్యాక్ గ్రౌండ్ లేకుండా సినిమాల్లోకి వచ్చి, స్టార్ హీరోయిన్ గా ఎదిగి సత్తా చాటిన కంగనా, తరవాత రాజకీయాల్లో కూడా అడుగుపెట్టింది. హిమాచల్ ప్రదేశ్, మండి నియోజక వర్గం నుంచి బీజేపీ తరపున ఎంపీగా పోటీ చేసి విజయం సాధించింది. ఇంత సక్సెస్ ఫుల్ జర్నీలో ఆస్తులు అమ్ముకోవాల్సిన అవసరం ఏమొచ్చింది అని ఆమె ఫాన్స్ కంగారు పడుతున్నారు. 


కంగన ముంబైలో ఉన్న త‌న ఇంటిని, బాంద్రాలో ఉన్న సినిమా ఆఫీస్ ని అమ్మేందుకు సిద్ధమయ్యిందని, ఆల్ రెడీ బేరసారాలు కొనసాగించినట్లు బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది. బాంద్రాలోని 3042 చ‌ద‌ర‌పు అడుగుల విస్తీర్ణంలో ఉన్న టు ఫ్లోర్ బిల్డింగ్ కాస్ట్ 40 కోట్లు ఉంటుంద‌ని అంచ‌నా. అసలు కంగ‌న ఎందుకు ఆస్తుల్ని అమ్ముతుంది? అన్న వివ‌రాలు తెలియలేదు. ఈ ప్ర‌చారాన్ని కంగ‌న కూడా కడించలేదు. నటిగా ఒక్కో సినిమాకి కోట్లలో రెమ్యునరేషన్ తీసుకుంటూ, మ‌ణిక‌ర్ణిక ఫిలింస్ పేర‌టి ఒక బ్యాన‌ర్ కూడా స్థాపించింది. ఈ సంస్థ ద్వారా భారీ బ‌డ్జెట్ సినిమాలు నిర్మిస్తోంది కంగనా. ఆర్ధిక ఇబ్బందుల కారణంగా అయితే ఆస్తులు అమ్మటం లేదన్నది నిజం.      


అయితే పూర్తి స్థాయిలో రాజకీయాల్లో పాల్గొనేలా, సినిమాలకి గుడ్ బై చెప్పనుంది అన్న రూమర్లు తెరపైకి వస్తున్నాయి. రాజకీయాల్లో టైమే కేటాయించాలనే, ముంబై నుంచి తన సొంత నియోజక వర్గమైన మండికి షిఫ్ట్ అయ్యే ఆలోచనలో ఉందని సమాచారం. ముంబై, టూ మండి జర్నీ కష్టమని, ప్రజలకి అందుబాటులో ఉండేందుకే ఇలా ముంబైకి వీడ్కోలు చెప్తోందని టాక్. సినిమాల్లో నటించటం కూడా మానేస్తుంది అన్న ప్రచారం కూడా జరుగుతోంది.