ENGLISH

ఎన్టీఆర్ ఫాన్స్ కి అదిరిపోయే న్యూస్

06 August 2024-21:22 PM

RRR సినిమాతో పాన్ ఇండియా స్టార్ గా మారిన ఎన్టీఆర్ నెక్స్ట్ దేవర సినిమాతో ఆడియన్స్ ముందుకు వస్తున్నాడు. కొరటాల శివ దర్శకత్వంలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా తెరకెక్కిన ఈ మూవీ సెప్టెంబర్ 27న రిలీజ్ కానుంది. నెక్స్ట్ వార్ 2 లో నటిస్తూనే తన తరవాత ప్రాజెక్ట్స్ పై ఫోకస్ చేసాడు. ఈ క్రమంలోనే ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో రాబోయే 'డ్రాగన్' సినిమా కోసం వర్క్ మొదలు పెట్టనున్నట్లు టాక్. ప్రశాంత్ కూడా డ్రాగన్ మూవీ తెరకెక్కించేందుకు చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నాడు. అందుకే సలార్ 2 వాయిదా వేసాడు. 


ఎన్టీఆర్ డ్రాగన్ కోసం స్క్రిప్ట్ వర్క్ కంప్లీట్ చేసి, క్యాస్టింగ్ సెలక్షన్ చేస్తున్నాడు. ఎన్టీఆర్ కి జోడి గా నేషనల్ క్రష్ రష్మిక ఎంపికయ్యింది. ఆగష్టు నెలలోనే ఈ సినిమాని అఫీషియల్ గా లాంచ్ చేయనున్నట్లు  ప్రచారం జరిగింది. లేటెస్ట్ అప్డేట్ ప్రకారం ఈ వీక్ లోనే  ఆగస్ట్ 9 న ఈ మూవీ  ప్రారంభం కానుంది. హైదరాబాద్‌లో పూజా కార్యక్రమాల కోసం భారీగా ఏర్పాట్లు చేస్తున్నారని, గెస్ట్ లు  కూడా ఎక్కువ మంది వచ్చే ఛాన్స్ ఉన్నట్లు టాక్.  


ప్రశాంత్ నీల్ సినిమాల్లో హీరో పాత్ర వేరే లెవెల్లో ఉంటుంది. నీల్ చూపించే హీరోయిజానికి ఎన్టీఆర్ ఎనర్జీ పక్కాగా ఉంటుందని, యశ్ కి కేజీఎఫ్ స్థాయి క్రేజ్ ఇచ్చినట్లే ఎన్టీఆర్ కి డ్రాగన్ రికార్డ్స్ అందిస్తుందని ఫాన్స్ ధీమా వ్యక్తం చేస్తున్నారు. మొత్తానికి ఎన్టీఆర్, నీల్ కాంబో మూవీ 2025 చివరిలో చూడొచ్చేమో అని సినీ క్రిటిక్స్ అంటున్నారు.