ENGLISH

Kushboo: మహిళా కమిషన్ మెంబర్‌గా కుష్బూ

28 February 2023-10:28 AM

బీజేపీ నేత, నటి కుష్బూ సుందర్‌ను కేంద్ర మహిళా కమిషన్ మెంబర్‌గా నియమిస్తూ మహిళా శిశు సంక్షేమ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఆమెతో పాటు మమత కుమారి, డెలినా కొంగ్డప్‌లను కూడా నియమించగా.. వీరు మూడేళ్లు ఈ పదవిలో కొనసాగుతారు.

 

దీనిపై కుష్బూ స్పందిస్తూ.. ‘ఇంతటి పెద్ద బాధ్యతను నాకు అప్పగించినందుకు ప్రధాని మోదీ, భారత ప్రభుత్వానికి ధన్యవాదాలు. నారీ శక్తిని పరిరక్షించడానికి కృషి చేస్తాను’ అని ట్వీట్ చేశారు...