ENGLISH

మెగా ఫ్యామిలిలో ఏం జరుగుతోంది ?

13 June 2024-16:20 PM

10 ఏళ్ళ నిరీక్షణ తరవాత పవన్ కళ్యాణ్ విక్టరీ సాధించటంతో మెగా ఫ్యామిలి పండగ చేసుకొంటోంది. ఎటు చూసినా సంతోషమే. ఫాన్స్ కూడా ఫుల్ ఖుషిగా ఉన్నారు. ప్రమాణ స్వీకార కార్యక్రమంలో మోదీ, పవన్-చిరు లను ప్రత్యేకంగా అభినదించటం అదొక స్పెషల్   మూమెంట్ గా నిలిచింది. మెగా ఫ్యామిలీ మొత్తం ఈ వేడుకకి హాజరు అయ్యి కేరింతలు కొట్టారు. ఇవన్నీ ఒక ఎత్తు అయితే ఈ వేడుకకి అల్లు ఫ్యామిలీ రాకపోవటం మరొక ఎత్తు. దీనితో రకరకాల ఊహాగానాలు మొదలవుతున్నాయి. అసలు మెగా కుటుబంలో ఏం జరుగుతోంది అని ఆరాలు మొదలుపెట్టారు. మెగా ఫ్యామిలీలో  ఏ వేడుక అయినా అంతా కలిసే చేసుకుంటారు. అలాంటిది మొన్నటికిమొన్న పవన్ కళ్యాణ్ గెలిచిన తరవాత చిరంజీవి ఇంటికి వెళ్తే మొత్తం కుటుంభం గ్రాండ్ వెల్కమ్ చెప్పింది. కేక్ కటింగ్ కూడా చేశారు. ఆ వేడుకలో ఎక్కడా అల్లు ఫ్యామిలీ కనిపించలేదు.


ఇప్పుడు ప్రమాణ స్వీకారోత్సవంలో కూడా అంతే ఒకరు కాకపొతే ఒక్కరు కూడా అల్లు వారు లేరు. దీనితో వారికి ఆహ్వానం అందలేదా, లేదా వారు కావాలని రాలేదా అని సందేహాలు మొదలయ్యాయి. అగ్నికి ఆజ్యం పోసినట్టు సాయి ధర్మతేజ్ అల్లు అర్జున్, స్నేహా రెడ్డి ట్విట్టర్, ఇనిస్టాగ్రమ్ అకౌంట్ లను అన్ ఫాలో చేసాడు. కేవలం అల్లు శిరీష్ ని మాత్రమే ఫాలో అవుతున్నాడు. మిగతా మెగా హీరోలు కామ్ గా ఉన్నారు. సాయి తేజ్ ఒక్కడే ఇలా బయట పడ్డాడు. ప్రస్తుతం ఈ విషయం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది.


ఏపీలో ఎన్నికలకు ముందు అల్లు అర్జున్ నంద్యాల వెళ్ళి వైసీపీ అభ్యర్థి శిల్పా రవికి మద్దతుగా ప్రచారంలో పాల్గోవటంతో వివాదం మొదలయ్యింది. పవన్ కళ్యాణ్ కోసం పిఠాపురం రాకుండా  నంధ్యాల వెళ్లడంపై మెగా ఫాన్స్ హార్ట్ అయ్యారు. నెక్స్ట్ డే నాగబాబు కూడా బన్నీని ఉద్దేశించి ఓ పోస్ట్ పెట్టడం, వెంటనే దానిని డిలేట్ చేయడం జరిగింది. అప్పటి నుంచి ఈ చిచ్చు ఆరలేదనే తెలుస్తోంది. ఎవరికీ వారే తమ తప్పు లేదని సమర్ధించుకుంటున్నారు.