ENGLISH

ఈ దసరా అసలు సిసలు సినిమా పండగ

09 June 2017-12:26 PM

దసరా సీజన్‌లో పెద్ద సినిమాలు పోటీ పడడం మామూలే. ఈ సారి దసరాకి చాలానే సినిమాలు వరుస కడుతున్నాయి. అందులో ముందుగా పూరీ - బాలయ్య కాంబినేషన్‌లో రాబోతున్న సినిమా లైన్‌లో ఉంది. ఈ సినిమా అనౌన్స్‌మెంట్‌ రోజే పూరీ ఆ సినిమా రిలీజ్‌ డేట్‌ కూడా ఫిక్స్‌ చేశాడు. సెప్టెంబర్‌ 29న ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. అందుకు తగ్గట్లుగానే షూటింగ్‌ కూడా శరవేగంగా జరుగుతోంది. మరో పక్క ఆగష్టులో విడుదలవుతుందనుకున్న మహేష్‌ 'స్పైడర్‌' కూడా సెప్టెంబర్‌కెళ్లింది. ఇక ఎన్టీఆర్‌ - బాబిల కాంబినేషన్‌లో వస్తోన్న 'జై లవ కుశ' సినిమాని సెప్టెంబర్‌లో బరిలోనే ఉంచారు చిత్ర యూనిట్‌. మరో పక్క ఈ ముగ్గురుతో పోటీ పడేందుకు వస్తున్నాడు మాస్‌ రాజా రవితేజ. రవితేజ నుండి సినిమా వచ్చి చాలా కాలమే అయ్యింది. గతేడాది మొత్తం రవితేజ సినిమా రాలేదు. ఏడాదికి రెండు మూడు సినిమాలతో సందడి చేసే రవితేజ ఒక ఏడాది పూర్తిగా కామ్‌గా ఉండిపోవడంతో రవితేజని ప్రేక్షకులు మర్చిపోయారు దాదాపుగా. అందుకే ఈ ఏడాది రెండు సినిమాలను ఒక్కసారిగా అనౌన్స్‌ చేసి సడెన్‌గా ఆశ్చర్యపరిచాడు మాస్‌ రాజా. వేణు శ్రీరామ్‌ డైరెక్షన్‌లో రవితేజ చేస్తున్న సినిమా 'రాజా ది గ్రేట్‌'. ఇదో ప్రయోగాత్మక చిత్రం కాగా, కొత్త దర్శకుడు విక్రమ్‌ సిరికొండతో మరో సినిమా చేస్తున్నాడు. 'టచ్‌ చేసి చూడు' అనే పవర్‌ ఫుల్‌ టైటిల్‌ ఈ సినిమాకి పెట్టారు. ఈ రెండు సినిమాల కోసం రవితేజ ఫుల్‌గా మేకోవర్‌ అయ్యాడట. ఈ మధ్య సినిమాల్లో రవితేజ బక్కచిక్కిపోయినట్లుగా కనిపించాడు. అది ప్రేక్షకులకు ఇష్టపడలేదు. దాంతో ఇదివరకటి హ్యాండ్‌సమ్‌ లుక్స్‌లోకి వచ్చేశాడు రవితేజ. విక్రమ్‌ సిరికొండ - రవితేజ కాంబినేషన్‌లో రాబోతున్న 'టచ్‌ చేసి చూడు' సినిమాని సెప్టెంబరులో విడుదల చేసేందుకు రవితేజ ప్లాన్‌ చేస్తున్నట్లు తాజా సమాచారమ్‌.

ALSO READ: 'కాలా' స్పీడ్‌ అదిరేలా..