ENGLISH

పాపులారిటీ కన్నా ప్రాధాన్యతే మిన్న అంటోన్న యంగ్‌ బ్యూటీ.!

01 December 2018-12:43 PM

ఒక్క సినిమాతోనే తప్పుకుంటున్నారు ఇప్పుడు ముద్దుగుమ్మలు. అయితే కొంతమంది మాత్రం సమ్‌థింగ్‌ ఇంట్రెస్ట్‌ క్రియేట్‌ చేస్తున్నారు. అలాంటివారి లిస్టులో 'నన్ను దోచుకుందువటే' చిత్రంతో తెలుగు ప్రేక్షకుల్ని పలకరించిన ముద్దుగుమ్మ నభానటేష్‌ పేరు కూడా చేర్చొచ్చు. తొలి సినిమాతో పర్‌ఫామెన్స్‌ పరంగా ఈ బ్యూటీ ఓకే అనిపించుకుంది. అలాగే అప్పియరెన్స్‌లోనూ గుడ్‌ అనిపించుకుంది. ఇక గ్లామర్‌లో కూడా ఎలాంటి హద్దులు లేకపోవడంతో ఈ బ్యూటీ బాగానే క్లిక్‌ అవుతుందనిపిస్తోంది.

 

నిజానికి ఈ బ్యూటీ తొలి చిత్రం 'అదుగో'. రవిబాబు డైరెక్షన్‌లో వచ్చిన ఈ సినిమా రిలీజ్‌ డేట్‌ లేట్‌ కావడంతో రెండో సినిమా 'నన్ను దోచుకుందువటే' ముందుగా ప్రేక్షకుల ముందుకు రావడంతో అమ్మడి పరిచయం ముందే జరిగిపోయింది. ఆ తర్వాత 'అదుగో' కూడా ఆ వెంటనే విడుదలవడంతో అమ్మడి ఫేస్‌ గుర్తుండిపోయింది. అయితే 'అదుగో' ఆశించిన రిజల్ట్‌ ఇచ్చి ఉంటే మరోలా ఉండేది. కానీ అలా జరగలేదు. కష్టపడినా ఆ సినిమా ఎందుకో జనానికి ఇష్టపడలేదు.

 

ఇప్పుడు లేటెస్టుగా నభా నటేష్‌ మాస్‌ రాజా రవితేజ సినిమాలో నటిస్తోంది. వి.ఐ.ఆనంద్‌ దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. రామ్‌ తాళ్లూరి నిర్మాత. కాగా వరుస పెట్టి సినిమాలు చేసేకన్నా, సినిమాలో మన పాత్ర ఎంతవరకూ గుర్తింపు దక్కించుకుందీ అన్న పాలసీనే ఫాలో అవుతానంటోంది నభా నటేష్‌. పాత్ర కోసం ఎంతటి సాహసం చేయడానికైనా సిద్ధం అంటోంది. అంతేకాదు హీరోయిన్‌గా సెటిలైపోవాలనే రూలేం లేదట. చిన్న పాత్ర అయినా, సినిమాకి కీలకం అనుకుంటే చేసేందుకు తానెప్పుడూ రెడీ అంటోంది. ఇలాంటి ఆటిట్యూడ్‌ ఉంటే, అమ్మడు టాలీవుడ్‌లో బిజీ కావడం నిస్సందేహం.