ENGLISH

రకుల్‌, అఖిల్‌ మధ్యలో నాగ్‌.!

21 December 2018-12:29 PM

అక్కినేని ఫ్యామిలీ సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌కి బ్రాండ్‌ అంబాసిడర్స్‌గా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. ఈ లిస్టులో మొన్నటి వరకూ సమంత కూడా ఉండేది. ఇప్పుడు రకుల్‌ ప్రీత్‌సింగ్‌ ఆ ప్లేస్‌లోకి వచ్చింది. అఖిల్‌, రకుల్‌ కలిసి సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌కి ప్రస్తుతం ప్రచార కర్తలుగా వ్యవహరిస్తున్నారు. ఇదిలా ఉంటే, ఆంధ్రప్రదేశ్‌, రాజమండ్రిలో తాజాగా సౌత్‌ ఇండియా షాపింగ్‌ మాల్‌ ఓపెనింగ్‌ సందర్భంగా అక్కినేని ఫ్యామిలీ రాజమండ్రిలో సందడి చేయనుంది.

వారితో కలిసి రకుల్‌ కూడా సందడి చేయనుంది. ఈ సందర్భంగా రాజమండ్రికి బయలుదేరారు అక్కినేని ఫ్యామిలీ విత్‌ రకుల్‌ ప్రీత్‌సింగ్‌. ఈ క్రమంలో అఖిల్‌, రకుల్‌ మధ్యలో నాగార్జున కలిసి దిగిన పిక్‌ ఒకటి సోషల్‌ మీడియాలో హల్‌చల్‌ చేస్తోంది. ట్రెడిషనల్‌ వేర్‌లో రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ మెరిసిపోతుండగా, పక్కనే అఖిల్‌ ట్రెండీ లుక్‌లో కనిపిస్తున్నాడు. వీరి మధ్యలో నాగార్జున కొంచెం గెడ్డం, హ్యాండ్‌సమ్‌లుక్స్‌తో ఫోటోకి పోజిచ్చారు.

ప్రస్తుతం నాగార్జున ఇతర భాషా చిత్రాలతో బిజీగా ఉన్నారు. బాలీవుడ్‌లో 'బ్రహ్మాస్త్ర' సినిమాలోనూ తమిళంలో ధనుష్‌తో ఓ సినిమాలో నటిస్తున్నారు. అఖిల్‌ 'మిస్టర్‌ మజ్ను'లో నటిస్తుండగా, ఇక రకుల్‌ప్రీత్‌సింగ్‌ 'ఎన్టీఆర్‌' బయోపిక్‌తో ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: సూపర్‌ స్టార్‌ కృష్ణతో నందమూరి బాల'కృష్ణుడు'!