ENGLISH

రారండోయ్‌... ఈ జంట‌ను చూద్దాం!

29 August 2020-13:00 PM

రారండోయ్ వేడుకు చూద్దాంలో జంట‌గా న‌టించారు నాగ‌చైత‌న్య - ర‌కుల్ ప్రీత్ సింగ్‌. ఇప్పుడు మ‌రోసారి జోడీ క‌ట్ట‌బోతున్న‌ట్టు టాక్‌. నాగ‌చైత‌న్య క‌థానాయ‌కుడిగా, విక్ర‌మ్ కె.కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా రూపుదిద్దుకోబోతోంది. `థ్యాంక్యూ` అనే టైటిల్ ప‌రిశీల‌న‌లో ఉంది. దిల్ రాజు నిర్మాత‌. ఈ చిత్రంలో క‌థానాయిక‌గా ర‌కుల్ ని ఎంచుకున్న‌ట్టు తెలుస్తోంది.

 

ఈరోజు నాగార్జున పుట్టిన రోజు సంద‌ర్భంగా `థ్యాంక్యూ`కి సంబంధించిన అఫీషియ‌ల్ ఎనౌన్స్‌మెంట్ వ‌చ్చేసింది. క‌థానాయిక ఎవ‌ర‌న్న‌ది చెప్ప‌లేదు గానీ, ఈ ప్రాజెక్టు 2021లో ప‌ట్టాలెక్కుతుంద‌ని చైతూ అధికారికంగా ప్ర‌క‌టించేశాడు. ప్ర‌స్తుతం `ల‌వ్ స్టోరీ`తో బిజీగా ఉన్నాడు నాగ‌చైత‌న్య‌. మ‌రో 10 శాతం తెర‌కెక్కిస్తే సినిమా రెడీ. వ‌చ్చే నెల‌లో మిగిలిన షూటింగ్ పూర్తి చేసి, సినిమాని విడుద‌ల చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది.

ALSO READ: మౌనమే సమాధానం అంటున్న సుక్కు?