ENGLISH

ప‌వ‌న్ ప‌క్క‌న నిత్య‌మీన‌న్‌?

25 March 2021-13:00 PM

మ‌ల‌యాళ `అప్ప‌య్య‌యుమ్ కోషియ‌మ్‌`ని తెలుగులో రీమేక్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. ప‌వ‌న్ క‌ల్యాణ్ - రానా క‌థానాయకులుగా న‌టిస్తున్నారు. ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు త్రివిక్ర‌మ్ ఈ చిత్రానికి స్క్రీన్ ప్లే, సంభాష‌ణ‌లు అందిస్తున్నారు. రానా ప‌క్క‌న ఐశ్వ‌ర్య రాజేష్ ని క‌థానాయిక‌గా ఎంచుకున్నారు. ప‌వ‌న్ ప‌క్క‌న సాయి ప‌ల్ల‌విని తీసుకున్నార‌న్న టాక్ వినిపించింది. అయితే... కాల్షీట్ల స‌మ‌స్య‌తో సాయి ప‌ల్ల‌వి ఈ సినిమా నుంచి డ్రాప్ అయ్యింది.

 

ఆ స్థానంలో నిత్య‌మీన‌న్ ని ఎంచుకున్నార‌ని స‌మాచారం. ప‌వ‌న్ - నిత్య క‌లిసి న‌టించ‌డం ఇదే తొలిసారి. నిజానికి సాయి ప‌ల్ల‌వి డేట్స్ కోసం చిత్ర‌బృందం విప‌రీతంగా ప్ర‌య‌త్నించింది. కానీ త‌న‌కున్న క‌మిట్‌మెంట్స్ వ‌ల్ల సాయి ప‌ల్ల‌వి ఈ సినిమా చేయ‌క‌లేక‌పోయింది. సాయి ప‌ల్ల‌వి `నో` చెప్ప‌డంతో ఈ పాత్ర‌లో నిత్య‌మీన‌న్ అయితే బాగుంటుంద‌ని త్రివిక్ర‌మ్ స‌ల‌హా ఇచ్చాడ‌ట‌.

 

త్రివిక్ర‌మ్ స‌ల‌హా ఇస్తే.. ఇక అది శాస‌నం లాంటిదే. వెంట‌నే నిత్య‌ని సంప్ర‌దించి, ఆమె కాల్షీట్లు తీసేసుకున్నారు. ఒక‌ట్రెండు రోజుల్లో ఓ అధికారిక ప్ర‌క‌ట‌న కూడా రావొచ్చు.

ALSO READ: నాగ్‌, అఖిల్ మల్టీస్టార‌ర్... క‌థ రెడీ!