ENGLISH

'జిగేల్‌ రాణి'కి మెగా భరోసా.!

16 November 2018-12:58 PM

తెలుగులో చాలా సినిమాలు చేసినా 'రంగస్థలం' ఒక్కటే చెప్పుకోదగ్గ సినిమాగా నిలిచింది ముద్దుగుమ్మ పూజా హెగ్దేకి. అయితే అది జస్ట్‌ స్పెషల్‌ సాంగే అయినా కానీ సినిమా సక్సెస్‌ పరంగా ఆమె కెరీర్‌లోనే బెస్ట్‌ సక్సెస్‌నిచ్చింది. ఇటీవల ఎన్టీఆర్‌తో నటించిన 'అరవింద సమేత..'లో పూజా హెగ్దే ఇంపార్టెంట్‌ రోల్‌ పోషించినా సక్సెస్‌ పరంగా చెప్పుకోదగ్గ తృప్తినివ్వలేదట. అలాగే రానున్న సినిమాలపై కూడా అంతగా ఆశ పెట్టుకోలేనని చెబుతోంది పూజాహెగ్దే.

ఇదిలా ఉంటే మెగా హీరోతో పూజాహెగ్దే నెక్స్ట్‌ సినిమా కన్‌ఫామ్‌ అయిందని తెలుస్తోంది. అది కూడా మెగా పవర్‌స్టార్‌ రామ్‌చరణ్‌తో సినిమా అనీ ప్రచారం జరుగుతోంది. వాస్తవానికి 'రంగస్థలం' సినిమా టైంలోనే పూజాహెగ్దేకి చరణ్‌ మాటిచ్చాడట తన తదుపరి సినిమాలో హీరోయిన్‌గా ఛాన్సిస్తానని. అయితే 'రంగస్థలం' తర్వాత చరణ్‌ నటిస్తున్న 'వినయ విధేయ రామ' చిత్రంలో కైరా అద్వానీ హీరోయిన్‌గా నటిస్తోంది. బోయపాటి శీను దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమా ఈ సంక్రాంతికి ప్రేక్షకుల ముందుకు రానుంది.

​కాగా చరణ్‌ నటిస్తున్న మరో తాజా చిత్రం 'ఆర్‌ఆర్‌ఆర్‌'. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ ప్రతిష్ఠాత్మక చిత్రంలో ఏమైనా పూజా హెగ్దేకి ఛాన్స్‌ దక్కుతుందేమో చూడాలి. ఏది ఏమైనా చరణ్‌తో పూజా హెగ్దే సినిమా అయితే ఖచ్చితంగా ఉంటుందని మాత్రం అందుతోన్న సమాచారమ్‌.

ALSO READ: 'ఎన్టీఆర్‌' బయోపిక్‌ కథానాయికల సందడి.!