ENGLISH

'కోటీశ్వరి' అవతారమెత్తిన ప్రముఖ నటి.!

18 October 2019-14:30 PM

హిందీలో బిగ్‌బీ అమితాబ్‌ హోస్టింగ్‌లో 'కౌన్‌ బనేగా కరోడ్‌పతి' అనే కార్యక్రమం గత కొన్నేళ్లుగా సక్సెస్‌ఫుల్‌గా రన్‌ అయ్యింది. ఇదే ప్రోగ్రామ్‌ని తెలుగులో 'మీలో ఎవరు కోటీశ్వరుడు' అనే పేరుతో నాగార్జున, చిరంజీవి హోస్టింగ్‌లో రన్‌ చేశారు. ఇప్పుడు ఇదే ప్రోగ్రామ్‌ తమిళంలోనూ మొదలవ్వనుంది. అయితే, ఈ షోకి ఓ స్పెషాలిటీ ఉంది. ఇది ఆడవాళ్లకు మాత్రమే. హోస్ట్‌ కూడా లేడీనే.

 

ఆ లేడీ మరెవరో కాదు. ఇన్నాళ్లూ నటిగా అలరించిన రాధికా శరత్‌ కుమార్‌. ఒకప్పుడు బిగ్‌ స్క్రీన్‌పై స్టార్‌ హీరోయిన్‌గా వెలుగొంది, ఇప్పుడు హుందా అయిన కీలక పాత్రలతో ఆకట్టుకుంటోంది రాధికా శరత్‌ కుమార్‌. బుల్లితెరపైనా రాధిక పలు సీరియల్స్‌తో అలరించింది. ఇప్పుడు సరికొత్త అవతారమెత్తబోతోంది హోస్ట్‌గా. ఇప్పటికే ఈ షోకి సంబంధించి రాధికపై ఫోటో షూట్‌ జరిగింది.

 

దానికి సంబంధించిన ఫోటోలు నెట్టింట్లో హల్‌చల్‌ చేస్తున్నాయి. నిండైన రూపంలో రాధిక ఫోటోలు అలరిస్తున్నాయి. తెలుగు, హిందీ భాషల్లో మంచి ఆదరణ పొందిన, పొందుతున్న ఈ షో తమిళ తంబీలను ఎలా ఆకట్టుకోనుందో చూడాలిక. డిశంబర్‌ నుండి ఈ షో ప్రారంభం కానుంది.

ALSO READ: అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరిన బిగ్‌బీ!