ENGLISH

మాన‌వ‌త్వం చ‌చ్చిపోయింది... ర‌ష్మీ ఆవేద‌న‌

10 November 2021-16:08 PM

సోష‌ల్ మీడియా వ‌చ్చాక‌... సెల‌బ్రెటీలు ఏదీ దాచుకోవ‌డం లేదు. ఎప్పుడు ఎలాంటి ఫీలింగ్ వచ్చినా బ‌య‌ట పెట్టేస్తున్నారు. అది ప్రేమ‌, కోపం, అస‌హ‌నం.. ఇలా ఏదైనా స‌రే. తాజాగా ర‌ష్మి ఈ స‌మాజంపై త‌న ఆవేద‌న‌ని వ్య‌క్తం చేసింది. `మాన‌వ‌త్వం చ‌చ్చిపోయింది... ఈ భూమిపై మాన‌వ‌జాతి అంత‌రించే స‌మ‌యం ఆస‌న్న‌మైంది` అంటూ త‌న అస‌హ‌నాన్ని వ్య‌క్త‌ప‌రిచింది. దానికి ఓ బ‌ల‌మైన కార‌ణం కూడా ఉంది. ర‌ష్మీకి.. మూగ జీవాలంటే చాలా ఇష్టం. క‌రోనా స‌మ‌యంలో... ఆక‌లితో అల‌మ‌టిస్తున్న వీధి కుక్క‌ల‌కు ప్ర‌తీరోజూ విధిగా ఆహారాన్ని అందించేది.

 

ఇప్ప‌టికీ వాటిపై అదే ప్రేమ చూపిస్తోంది. అయితే ఇటీవల దీపావళి సంబరాల్లో పశ్చిమ బెంగాల్‏లో దారుణ ఘటన జరిగింది. దీపావ‌ళి రోజున‌ కొందరు ఆకతాయి కుర్రాళ్లు ఓ వీధి కుక్కపై తమ సైకోయిజాన్ని చూపించారు. కుక్క తోకకు టపాసులు కట్టి పేల్చేశారు. దీంతో ఆ కుక్క కాలుకు తీవ్ర గాయాలై.. తోక తెగి పడింది. ఇది గమనించిన చుట్టుపక్కల జనం ఆ కుక్కను ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. దీనికి సంబంధించిన వార్త‌ని పోస్ట్ చేస్తూ...

 

''భూమి పై మనవజాతి అంతరించే సమయం వచ్చింది'' అంటూ కామెంట్ చేస్తోంది. ర‌ష్మిక పోస్ట్ కి మంచి స్పంద‌న వ‌స్తోంది. ఆ ఆక‌తాయిల‌ని క‌ఠినంగా శిక్షించాల‌ని, ఇక‌పై ఇలాంటి దారుణ‌మైన ఘ‌ట‌న‌లు జ‌ర‌క్కుండా చూడాల‌ని ప్ర‌భుత్వాల‌ను, స్వ‌చ్ఛంద సంస్థ‌ల‌కు నెటిజ‌న్లు కోరుతున్నారు.

ALSO READ: Rashmi Latest Photoshoot