ENGLISH

'వర్మ' కోసం రష్మికా.?

08 February 2019-12:30 PM

సినిమాలు నిర్మాణ దశలో ఆగిపోవడం, నిర్మాణానికి ముందే ఆగిపోవడం, నిర్మాణం పూర్తయ్యాక, రిలీజ్‌ కాకుండా ఆగిపోవడం కొత్తేమీ కాదు. సినిమా మొత్తం రీషూట్‌ చేయడం బహుశా ఇదే తొలిసారేమో. 'అర్జున్‌రెడ్డి' తమిళ రీమేక్‌ దుస్థితి ఇది. విలక్షణ నటుడు విక్రమ్‌ తనయుడు ధృవ్‌ హీరోగా తెరంగేట్రం చేస్తున్న ఈ సినిమా ఇప్పుడు అంతటా చర్చనీయాంశమైంది. 

 

మళ్లీ మొదట్నుంచీ కొత్త దర్శకుడితో ఈ సినిమా షూట్‌ చేయబోతున్నారు. హీరో తప్ప అందరూ మారిపోతున్నారు. టీమ్‌ మొత్తం కొత్తదే. హీరోయిన్‌గా రష్మిక మందన్న పేరు వినిపిస్తోంది. తొలుత మేఘా చౌదరితో 'అర్జున్‌రెడ్డి' రీమేక్‌ 'వర్మ' రూపొందించారు. దాన్ని స్క్రాప్‌ చేసి కొత్త టీమ్‌తో సినిమా తెరకెక్కిస్తారు. నటీనటుల ఎంపిక షురూ అయ్యింది. రష్మికా దగ్గరికి ప్రతిపాదన వెళ్లింది. 

 

అయితే 'అర్జున్‌రెడ్డి' బోల్డ్‌ ఫిలిం కాబట్టి రష్మికా ఒప్పుకుంటుందా.? లేదా.? అనేది ప్రస్తుతానికి సస్పెన్స్‌. మరోపక్క ఓ బాలీవుడ్‌ భామ పేరును కూడా పరిశీలిస్తున్నారట. హిందీలో 'కబీర్‌సింగ్‌' పేరుతో అర్జున్‌రెడ్డి రీమేక్‌ అవుతోంది. ఒరిజినల్‌ దర్శకుడు సందీప్‌ రెడ్డి వంగా ఈ సినిమాని బాలీవుడ్‌లో తెరకెక్కిస్తున్నారు. దర్శకుడిగా అతన్నే 'వర్మ' టీమ్‌ పిలిచే అవకాశాలున్నాయా.? ఏమో వేచి చూడాల్సిందే.

ALSO READ: వెంకీ ఇంట్లో పెళ్లి.. వివ‌రాలు ఇవే!