ENGLISH

నలుగురు క్వీన్స్‌ ఒకేచోట: కెవ్వుకేక

30 November 2017-16:36 PM

ఏంటి నలుగురు ముద్దుగుమ్మల్ని అలా ఒకే స్క్రీన్‌పై చూస్తుంటే కడుపు నిండిపోతోంది కదూ. ఈ నలుగురు భామలే క్వీన్సే మరి. అందంలోనే కాదు, అభినయంలోనూ క్వీన్సే. అందుకే 'క్వీన్‌' సినిమా కోసం ఈ నలుగురు భామలూ నాలుగు భాషల్లో నటిస్తున్నారు. 

తెలుగులో 'క్వీన్‌'గా తమన్నా నటిస్తోన్న సంగతి తెలిసిందే. బాలీవుడ్‌లో కంగనా రనౌత్‌ హీరోయిన్‌గా నటించిన 'క్వీన్‌' సినిమాకి ఇది రీమేక్‌గా తెరకెక్కుతోంది. తెలుగులో 'క్వీన్‌' పేరుతోనే ఈ సినిమాని రూపొందిస్తున్నారు. తమిళంలో కాజల్‌ అగర్వాల్‌ హీరోయిన్‌గా నటిస్తోంది. 'పారిస్‌ పారిస్‌' టైటిల్‌తో తెరకెక్కుతోంది. మలయాళంలో మంజిమా మోహన్‌ క్వీన్‌ పాత్ర పోషిస్తోంది. 'జామ్‌ జామ్‌' టైటిల్‌తో తెరకెక్కుతోంది. ఇక కన్నడలో పరుల్‌ యాదవ్‌ లీడ్‌ రోల్‌ పోషిస్తుండగా, 'బటర్‌ఫ్లై' టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్‌ చేశారు. 

కాగా ఈ నలుగురు భామలు ఎందుకిలా ఒకే స్క్రీన్‌పై కనిపిస్తున్నారంటే, ఈ సినిమా షూటింగ్‌ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో జరుగుతోంది. సో నలుగురు భామలూ ఒకే చోట ఉన్నారు. సరదాగా ఫేస్‌బుక్‌ ఛాట్‌కి వచ్చారు ఈ నలుగురు ముద్దుగుమ్మలు. అభిమానులతో సినిమా గురించి సరదాగా ముచ్చటించారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సందడి సందడిగా సమాధానాలు చెప్పారు. అభిమానులకు ఈ నలుగురినీ ఇలా చూస్తే భలే ముచ్చటగా అనిపించింది. 

బాలీవుడ్‌లో మంచి విజయం అందుకుంది ఈ చిత్రం. ఈ చిత్రంతోనే కంగనా దశ తిరిగిపోయింది. ఆల్రెడీ తెలుగులో స్టార్‌ హీరోయిన్స్‌ అనిపించుకున్న కాజల్‌ అగర్వాల్‌, తమన్నాలు ఈ సినిమాతో ఇంకెంత గుర్తింపు తెచ్చుకుంటారో. అలాగే 'సాహసం శ్వాసగా సాగిపో' సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ మంజిమా మోహన్‌కి ఈ సినిమా మరింత మంచి పేరు తెచ్చిపెడుతుందేమో చూడాలిక. ఏదేమైనా నలుగురు అందాల భామలు ఇలా ఒకే ఫ్రేమ్‌లో కనిపిస్తే ఆ కిక్కే వేరప్పా!

ALSO READ: పవన్ కళ్యాణ్ కి అన్నయ్యే అడ్డంకి..