ENGLISH

Tarakaratna: డేంజ‌ర్ జోన్ నుంచి బ‌య‌టప‌డ్డ‌ తార‌క‌ర‌త్న

30 January 2023-11:01 AM

నంద‌మూరి అభిమానుల‌కు గుడ్ న్యూస్‌. తార‌క‌ర‌త్న కోలుకొంటున్నారు. ఇటీవ‌ల లోకేష్ పాద యాత్ర‌లో పాల్గొన్న నంద‌మూరి తార‌క‌ర‌త్న‌... గుండెపోటుతో సొమ్మ సిల్లిన సంగ‌తి తెలిసిందే. ఆయ‌న ప్ర‌స్తుతం బెంగ‌ళూరులోని హృద‌యాల‌య లో చికిత్స తీసుకొంటున్నారు. ఆయ‌న కండీష‌న్ చాలా సీరియ‌స్‌గా ఉంద‌ని రెండు రోజులుగా ప్ర‌చారం జ‌రుగుతోంది. డాక్ట‌ర్లు కూడా అదే చెప్పారు. ఎక్మో స‌హాయంతో ఆయ‌న‌కు ట్రీట్ మెంట్ జ‌రుగుతోంది. ఎక్మో అంటే.. డేంజ‌ర్ జోన్‌లో ఉన్న‌ట్టే.

 

ఇప్పుడు ఆ ఎక్మోని తొల‌గించారు. తార‌క‌ర‌త్న శ‌రీరం చికిత్స‌కు స్పందించ‌డం మొద‌లెట్టింద‌ని, ఆయ‌న క్ర‌మంగా కోలుకొంటున్నార‌ని ఆసుప‌త్రి వ‌ర్గాలు చెబుతున్నాయి. త్వ‌ర‌లోనే ఆయ‌న్ని డిశ్చార్జ్ చేసే అవ‌కాశాలు పుష్క‌లంగా ఉన్నాయి. కాక‌పోతే.. ఆయ‌న ఇప్పుడు పూర్తిగా విశ్రాంతి తీసుకోవాల‌ని, క‌నీసం ఆరు నెల‌ల పాటు ఇంటి ప‌ట్టునే ఉండాల‌ని వైద్యులు చెబుతున్నార‌ట‌. మొత్తానికి తార‌క‌ర‌త్న డేంజ‌ర్ జోన్ నుంచి బ‌య‌ట‌ప‌డ‌డం అభిమానుల‌కు ఆనందాన్ని ఇచ్చే విష‌య‌మే.