ENGLISH

తేజతో రానా.. ఈ సారి విభిన్నంగా!

24 January 2020-11:00 AM

క్రియేటివ్‌ డైరెక్టర్‌ తేజ - విలక్షణ నటుడు రానా కాంబినేషన్‌లో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమా తెరకెక్కిన సంగతి తెలిసిందే. చాలా కాలంగా హిట్‌ కోసం ఎదురు చూస్తున్న తేజకు ఈ సినిమాతో మంచి బ్రేక్‌ వచ్చింది. అలాగే రానాకీ హీరోగా రానాకీ మంచి పేరు తీసుకొచ్చింది. 'బాహుబలి' తర్వాత రానా నటించిన సినిమా ఇది. అప్పుడే రానాతో మరో సినిమా చేయాలని తేజ భావించారు. కానీ, కుదరలేదు. ఇప్పటికి ఆ సమయం వచ్చినట్లు తెలుస్తోంది. తేజ సిద్ధం చేసిన ఓ స్క్రిప్టులో రానా నటించబోతున్నాడట. అయితే, ఈ సారి రానాని తేజ విలన్‌గా చూపించబోతున్నాడట. తేజ సినిమాల్లో విలన్స్‌ చాలా క్రూరంగా ఉంటారు. ఆల్రెడీ అతి క్రూరమైన విలన్‌గా 'భళ్లాలదేవ' పాత్ర పోషించేశాడు రానా.

 

అంతకు మించి ఈ సినిమాలో విలన్‌ పాత్ర ఉండబోతోందనీ టాక్‌. 'రాక్షస రాజ్యంలో రావణాసురుడు' అనే ఇంట్రెస్టింగ్‌ టైటిల్‌ని ఈ సినిమాకి ఫిక్స్‌ చేశారట. ఇంకేముంది టైటిల్‌లోనే విలన్‌ ఉన్నాడు. విలన్‌ పాత్రను దృష్టిలో పెట్టుకునే తేజ ఈ స్క్రిప్టు రాసి ఉండొచ్చు. అయితే, ఈ సినిమాలో హీరో ఎవరన్నది ఇంకా తెలియరాలేదు. ఫామ్‌లో ఉన్న ఓ యంగ్‌ హీరో ఈ సినిమాలో హీరోగా నటించనున్నాడనీ తెలుస్తోంది. మరోవైపు రానా నటిస్తున్న 'విరాటపర్వం' షూటింగ్‌ శరవేగంగా జరుగుతోంది. అలాగే గుణశేఖర్‌ దర్శకత్వంలో తెరకెక్కబోయే భారీ బడ్జెట్‌ చిత్రం 'హిరణ్య కశ్యప' ప్రీ ప్రొడక్షన్‌ పనులు జరుపుకుంటోంది. వీటితో పాటు, హిందీలో 'హాథీ మేరీ సాతీ', '1945' తదితర చిత్రాలు రానా చేతిలో ఉన్నాయి.

ALSO READ: పెళ్లి ముచ్చట సరే, సినిమా సంగతేంటీ?