ENGLISH

కాజల్ కి ఆ కబురు చెప్పే టైమొచ్చేసింది..!

23 February 2018-12:39 PM

చెల్లెలు నిషా అగర్వాల్‌ పెళ్లైపోయింది. ఆమె ఇటీవల ఓ బిడ్డకి జన్మనిచ్చింది. పెద్దమ్మ కాజల్‌ అగర్వాల్‌ మురిసిపోయింది. చెల్లెలికి పెళ్లైపోయింది కానీ, అక్క కాజల్‌ ఇంకా పెళ్లి కబురు చెప్పడానికి ఇష్టపడట్లేదు. ఎందుకిలా అనడిగితే, కెరీర్‌ గురించి ఆలోచన తప్ప, పెళ్లి గురించి ఆలోచన లేదు ఇప్పటికి అంటోందీ ముద్దుగుమ్మ. అలాగనీ పెళ్లి చేసుకోకుండా ఒంటరిగా ఉండిపోననీ చెబుతోంది. అయితే ఇప్పుడు తన ఫోకస్‌ అంతా కెరీర్‌ మీదే అంటోంది అందాల కాజల్‌ అగర్వాల్‌. ఇప్పుడు కళ్యాణ్‌రామ్‌తో 'ఎమ్మెల్యే' సినిమాలో నటిస్తోంది.

ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. ఇటీవలే 'అ' చిత్రంలో నటించింది. ఈ చిత్రంలో చాలా మంది నటీ, నటులున్నప్పటికీ, స్పెషల్‌గా కాజల్‌కి మంచి పేరొచ్చింది. గతేడాదిలో కాజల్‌ కెరీర్‌లో మంచి హిట్లున్నాయి. మెగాస్టార్‌తో 'ఖైదీ' చిత్రంలోనూ రానాతో 'నేనే రాజు నేనే మంత్రి' సినిమాల్లో నటించింది. రెండు సినిమాలతోనూ సూపర్‌ హిట్లు కొట్టింది. బాలీవుడ్‌కి మళ్లీ వెళ్లే ఆలోచన వుందా అంటే, ఇప్పట్లో లేదు కానీ, మంచి అవకాశాలు వస్తే వదులుకోనంటోంది కాజల్‌. ఇకపోతే ప్రేమ విషయాన్ని ఆమె వద్ద ప్రస్థావిస్తే, ప్రపోజల్స్‌ వస్తున్నాయి కానీ, ఇంతవరకూ తను ఎవరికీ కనెక్ట్‌ కాలేదనీ అంటోంది.

ఇదిలా ఉండగా, తమిళంలోనూ కాజల్‌ బిజీగానే గడుపుతోంది. బాలీవుడ్‌లో కంగనా హీరోయిన్‌గా తెరకెక్కిన 'క్వీన్‌' చిత్రం తమిళంలో కాజల్‌ హీరోయిన్‌గా రీమేక్‌ అవుతోంది. 'పారిస్‌ పారిస్‌' టైటిల్‌తో తెరకెక్కుతోన్న ఈ చిత్రం ప్రసుత్తం నిర్మాణంలో ఉంది. ఇలా ఇటు తెలుగు, తమిళ సినిమాలతో బిజీగా గడుపుతున్న కాజల్‌ బ్యూటీ పెళ్లి కబురు ఎప్పుడు చెబుతుందోనని ఆమె అభిమానులు ఈగర్‌గా ఎదురు చూస్తున్నారు.

ALSO READ: Qlik Here Kajal Latest Photoshoot