ENGLISH

'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌': ఆదికి అలా కలిసొచ్చింది.

15 August 2019-09:30 AM

కశ్మీరీ ఇష్యూ వేడిగా ఉన్న ఈ తరుణంలో అనూహ్యంగా 'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌' మూవీ తెరపైకి వచ్చింది. వాస్తవానికి ఈ సినిమా సంగతి గత రెండు మూడు నెలలుగా నానుతూనే ఉంది. దీనికి సంబంధించిన ప్రచార చిత్రాలు కూడా ఆల్రెడీ విడుదలయ్యాయి. అయితే, సిట్యువేషన్‌ వచ్చింది కాబట్టి, యూజ్‌ చేసుకోవాలి కదా. కశ్మీర్‌ ఇష్యూ రాక ముందే, ఈ సినిమాలోని సబ్జెక్ట్‌ ప్రస్తుత పరిణామాలకు సింక్‌ అయ్యేలా ఉండడంతో, సినిమాని ఈ పరిస్థితుల్లో విడుదల చేస్తే కలిసొస్తుందని భావించింది చిత్రయూనిట్‌.

 

త్వరలో 'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌'ని ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చేందుకు సన్నాహాలు చేస్తున్నారు. ఆది సాయి కుమార్‌ ఈ సినిమాలో హీరోగా నటిస్తున్నాడు. సాయి కిరణ్‌ అడవి దర్శకత్వం వహించారు. కశ్మీరీ పండిట్స్‌ జీవితాల్లోని ఎమోషన్స్‌ని ఈ సినిమాలో చూపించారు. కశ్మీరీ పండిట్‌ పాత్రలో ఆది సాయికుమార్‌ నటిస్తున్నాడు. సిక్స్‌ ప్యాక్‌ బాడీతో, పవర్‌ఫుల్‌ క్యారెక్టర్‌ పోషించాడు ఆది ఈ సినిమాలో. ఎక్కువ భాగం ఈ సినిమాని కశ్మీర్‌ పరిసర ప్రాంతాల్లోనే చిత్రీకరించారు. సిట్యువేషన్‌ అయితే బాగానే కలిసొచ్చింది. అలాగే 'ఆపరేషన్‌ గోల్డ్‌ ఫిష్‌'తో ఆదికి సక్సెస్‌ కూడా కలిసి రావాలని ఆశిద్దాం.

ALSO READ: అసలు పెళ్లే చేసుకోనంటోన్న ఆ 'లేడీ విలన్‌'.