ENGLISH

వీర‌భ‌ద్ర‌మ్‌.. మ‌ళ్లీ వచ్చాడు

26 May 2022-11:03 AM

అహ‌నా పెళ్లంట‌, పూల రంగ‌డు చిత్రాల‌తో హిట్లు కొట్టాడు వీర‌భ‌ద్ర‌మ్‌. దాంతో నాగార్జున పిలిచి మరీ అవ‌కాశం ఇచ్చాడు. అయితే భాయ్ దారుణంగా దెబ్బ‌కొట్టింది. ఆ సినిమా డిజాస్ట‌ర్ అవ్వ‌డంతో వీర‌భ‌ద్ర‌మ్ కెరీర్‌పై... తీవ్ర ప్ర‌భావం చూపించింది. భాయ్ ఫ్లాప్ త‌ర‌వాత మ‌రో సినిమా రావ‌డానికి చాలా కాలం ప‌ట్టింది. చివ‌రికి ఆదితో చుట్టాల‌బ్బాయ్ తీశాడు. ఆ త‌ర‌వాత మ‌ళ్లీ బ్రేక్‌. ఇన్నాళ్ల‌కు.... వీర‌భ‌ద్ర‌మ్ కి మ‌రో అవ‌కాశం వ‌చ్చింది. న‌రేష్ అగ‌స్త్య క‌థానాయ‌కుడిగా జ‌య దుర్గాదేవి మ‌ల్టీమీడియా సంస్థ ఓ చిత్రాన్ని రూపొందిస్తోంది. దీనికి వీర‌భ‌ద్ర‌మ్ ద‌ర్శ‌కుడు.

 

వీర‌భ‌ద్ర‌మ్ ది కామెడీ స్కూలు. ఈవీవీ ద‌గ్గ‌ర శిష్య‌రికం చేశాడు. దాంతో కామెడీ టింజ్ అంటింది. ఇప్ప‌టి వ‌ర‌కూ చేసిన సినిమాల‌న్నీ ఎంట‌ర్‌టైన్‌మెంట్ జోన‌ర్‌వే. అయితే సారి.. వీర‌భ‌ద్ర‌మ్ రూటు మార్చాడు. క్రైమ్ జోన‌ర్ లో ఈ సినిమా చేస్తున్నాడు. `సేనాప‌తి` లాంటి చిత్రాల‌తో న‌రేష్ అగ‌స్త్య కూడా త‌న‌ని తాను నిరూపించుకున్నాడు. సో.. ఈ కాంబోపై ఓ లుక్ వేయొచ్చు. అనూప్ రూబెన్స్ ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్నాడు. మిగిలిన వివ‌రాల‌న్నీ త్వ‌ర‌లో తెలుస్తాయి.

ALSO READ: ఎఫ్ 3... బుకింగ్స్ ఏమిటి ఇలా ఉన్నాయ్‌..!