ENGLISH

ట్రైల‌ర్‌కి రంగం సిద్ధం చేసుకున్న రాధేశ్యామ్‌

08 December 2021-15:00 PM

ప్రభాస్ క‌థానాయ‌కుడిగా న‌టిస్తున్న మ‌రో పాన్ ఇండియా చిత్రం.. రాధే శ్యామ్‌. పూజా హెగ్డే క‌థానాయిక‌. రాధా కృష్ణ ద‌ర్శ‌కుడు. సంక్రాంతికి విడుద‌ల కానుంది. ఈలోగా ప్రమోష‌న్ల‌నూ మొద‌లెట్టేస్తున్నారు. ట్రైల‌ర్ తో ఈ సినిమా ప్ర‌మోష‌న్ల‌కు కిక్ స్టార్ట్ చేయాల‌ని చిత్ర‌బృందం భావిస్తోంది. ఇప్పుడు ట్రైల‌ర్ రిలీజ్‌కి ముహూర్తం కుదిరింద‌ని టాక్‌. ఈనెల 17న రాధే శ్యామ్ ట్రైల‌ర్ విడుద‌ల చేసే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. ఒక‌ట్రెండు రోజుల్లో అధికారిక ప్ర‌క‌ట‌న రానుంది.

 

ఇప్పటికే పోస్టర్స్, సాంగ్స్‌తో భారీ అంచనాలు నెలకొన్న 'రాధే శ్యామ్' నుంచి రాబోతున్న ట్రైలర్ మరో లేవల్‌లో ఉండబోతుందని టాక్ వినిపిస్తోంది. ఇక ఇప్పటికే థియేట్రికల్ ట్రైలర్ కటింగ్ పూర్తైందట. ఈ చిత్రాన్ని యూవీ క్రియేషన్స్ - టి సిరీస్ కలిసి భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నాయి. ఇదో పిరియాడిక‌ల్ డ్రామా. ఈ ప్రేమ‌క‌థ‌లో హ‌స్త సాముద్రికం కీల‌క పాత్ర పోషిస్తోంది. క్లైమాక్స్ విషాద‌భ‌రితంగా ఉండ‌బోతోంద‌న్న ఓ టాక్ వినిపిస్తోంది. అదెంత వ‌ర‌కూ నిజ‌మో తెలియాలంటే సినిమా విడుద‌ల‌య్యేంత వ‌ర‌కూ ఆగాల్సిందే.

ALSO READ: యాక్సిడెంట్ చేసి అడ్డంగా బుక్ అయిన బుల్లి తెర స్టార్‌