ENGLISH

సమంత కు అరుదైన గుర్తింపు

23 October 2024-17:55 PM

సౌత్ స్టార్ హీరోయిన్ సమంత ఇప్పుడు పాన్ ఇండియా హీరోయిన్ గా మారింది. సామ్ ఇప్పటికే ఫ్యామిలీ మెన్ వెబ్ సిరీస్ తో పాన్ ఇండియా రేంజ్ లో పేరు తెచ్చుకుంది. ఇప్పడు హానీ బనీ సిరీస్ తో మెప్పించేందుకు రెడీ అయ్యింది. దీనితో సామ్ క్రేజ్ మాములుగా లేదు. ప్రజంట్  ఎక్కడ చూసినా సామ్ ట్రెండింగ్ లో ఉంది. అది ఎక్కడివరకు వచ్చింది అంటే బాలీవుడ్ టాప్ హీరోయిన్స్ కూడా సామ్ ముందు దిగదుడుపు అయిపోయారు.  సామ్ ఒక వైపు సినిమాలు, సిరీస్ లలో నటిస్తూ, నిర్మిస్తూ, ఇంకో వైపు బిజినెస్ రంగం లో కూడా దూసుకుపోతోంది. బ్రాండ్ అంబాసిడర్ గా కూడా సత్తా చాటుతోంది. 


ఈ క్రమంలోనే సామ్ ఆలియా, దీపికా పదుకొనె లాంటి స్టార్స్ ని సైతం వెనక్కి నెట్టి నంబర్ వన్ స్థానంలో నిల్చుంది. ఒర్మాక్స్ మీడియా తాజాగా 2024 సెప్టెంబరులో ఇండియాలో అత్యంత ప్రజాదరణ పొందిన హీరోయిన్స్ ఎవరన్న సర్వే చేయగా ఈ లిస్ట్ లో అనూహ్యంగా సామ్ మొదటి ప్లేస్ లో ఉంది. మిగతా స్థానాల్లో కూడా సౌత్ హీరోయిన్స్ నిలవటం గమనార్హం. టాప్ టెన్ లో ఆరు స్థానాలు సౌత్ నటీమణులు దక్కించుకున్నారు. ఈ సర్వే లో 'భారతదేశంలో అత్యంత ప్రజాదరణ పొందిన ఫీమేల్ యాక్ట్రెస్ గా సామ్ ఫస్ట్ ప్లేస్ లో నిల్చింది. 


ఈ సర్వే ద్వారా ఇంకో సారి సామ్ క్రేజ్ ఏంటో తెలుస్తోంది. హానీ బనీ రిలీజ్ తరువాత సామ్ క్రేజ్ మరింత పెరిగి బాలీవుడ్ లో బిజీ హీరోయిన్ గా మారే అవకాశముంది. ఈ సర్వేలో సెకండ్ ప్లేస్ లో అలియా భట్, 3RD ప్లేస్ లో దీపికా పదుకొనే, 4 ప్లేస్ లో నయనతార, 5 ప్లేస్ లో త్రిష, 6 ప్లేస్ లో శ్రద్ధా కపూర్, 7 ప్లేస్ లో కాజల్ అగర్వాల్, 8 ప్లేస్ లో సాయి పల్లవి, 9 ప్లేస్ లో రష్మిక మందన్న, 10 ప్లేస్ లో కియారా అద్వానీ నిలిచారు. నలుగురు బాలీవుడ్ హీరోయిన్స్ కే చోటు దక్కటం విశేషం.