ENGLISH

త్రివిక్ర‌మ్ తో స‌మంత ప్యాచ‌ప్ జ‌రిగిపోయిన‌ట్టేనా?

24 November 2021-14:10 PM

త్రివిక్ర‌మ్ కి ఓ అల‌వాటు ఉంది. త‌న‌తో ప‌నిచేసిన హీరోయిన్ల‌ని మ‌ళ్లీ మ‌ళ్లీ రిపీట్ చేస్తుంటాడు. జులాయి, జ‌ల్సా సినిమాల్లో ఇలియానా క‌థానాయిక‌గా న‌టించింది. స‌మంత‌తో స‌న్నాఫ్ స‌త్య‌మూర్తి, అత్తారింటికి దారేది, అ.ఆ తీశాడు. ఇప్పుడు పూజా హెగ్డేకి వ‌రుస‌గా అవ‌కాశాలు ఇస్తున్నాడు. త‌న కొత్త సినిమాలోనూ పాత హీరోయిన్ల‌ని కొన‌సాగించ‌డం అనే సెంటిమెంట్ ని మ‌ళ్లీ ఫాలో అవుతున్నాడు.

 

త్వ‌ర‌లోనే మ‌హేష్ బాబుతో త్రివిక్రమ్ ఓ సినిమా చేయ‌బోతున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో క‌థానాయిక‌గా పూజా హెగ్డేని ఎంచుకున్నాడు త్రివిక్ర‌మ్‌. ఈ సినిమాతో త్రివిక్ర‌మ్ - పూజాల కాంబో హ్యాట్రిక్ కొట్టిన‌ట్టైంది. ఇప్పుడు ఇదే సినిమాలో మ‌రో క‌థానాయిక‌గా స‌మంత న‌టించ‌బోతోంద‌ని ప్ర‌చారం జ‌రుగుతోంది. అ.ఆ త‌ర‌వాత‌.. స‌మంత‌తో మ‌రో సినిమా చేయ‌లేదు త్రివిక్ర‌మ్. వాళ్లిద్ద‌రి మ‌ధ్య కొంత గ్యాప్ వ‌చ్చింద‌ని, అందుకే స‌మంత‌కు ఛాన్సులు ఇవ్వ‌డం లేద‌ని గుస‌గుస‌లు వినిపించాయి. ఇప్పుడు ఏమైందో, ఏమో.. మ‌ళ్లీ ప్యాచ‌ప్ అయిపోయారు. అందుకే మ‌హేష్ సినిమాలో స‌మంత స‌డ‌న్ గా వ‌చ్చేసింద‌ని గాసిప్పులు వినిపిస్తున్నాయి. మ‌రి ఇదెంత వ‌ర‌కూ నిజ‌మో తెలియాలంటే ఇంకొన్నిరోజులు ఆగాలి.

ALSO READ: ఆర్‌.ఆర్‌.ఆర్ లో ఎన్టీఆర్ స్పెష‌ల్ అట్రాక్ష‌న్‌