ENGLISH

బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిన నందిత

21 April 2017-16:04 PM

'ప్రేమకథాచిత్రం' ఫేం నందిత అచ్చ తెలుగమ్మాయి. పలు తెలుగు సినిమాల్లో నటించిన నందితను తెలుగు తెరకు పరిచయం చేసింది ఒకప్పటి సంచలన దర్శకుడు తేజ. 'నీకు నాకు డాష్‌ డాష్‌' సినిమాతో నందిత హీరోయిన్‌గా పరిచయమైంది. నటిగా టాలెంట్‌ ఉన్నప్పటికీ అమ్మడికి టైం కలిసి రావడం లేదు. దాంతో రేస్‌లో వెనకే ఉండిపోయింది. ఈ బ్యూటీ లేటెస్ట్‌గా బంపర్‌ ఆఫర్‌ కొట్టేసిందట. అదేమిటంటే నందమూరి కళ్యాణ్‌రామ్‌ నిర్మిస్తున్న 'జై లవ కుశ' సినిమాలో నందితకి ఛాన్స్‌ వచ్చిందని సమాచారమ్‌. బాబీ ఈ చిత్రానికి దర్శత్వం వహిస్తున్నారు. ఈ సినిమాలో ఎన్టీయార్‌ హీరోగా నటిస్తున్నాడు. ఎన్టీఆర్‌ది ఈ సినిమాలో త్రిపాత్రాభినయం అన్న సంగతి కూడా తెలిసిందే. ఈ సినిమాలో రాశీఖన్నా, నివేదా థామస్‌ ఎన్టీఆర్‌కి జంటగా నటిస్తున్నారనీ తెలియ వస్తోంది. తాజాగా నందిత పేరు తెరపైకి వచ్చింది. అయితే ఎన్టీయార్‌ సరసన నందిత హీరోయిన్‌గా నటించట్లేదనీ, ఓ ముఖ్య పాత్ర కోసం ఆమెను తీసుకున్నారనీ తెలియవస్తోంది. ఈ సినిమాలో ఇప్పటిదాకా నివేదా థామస్‌ పేరు మాత్రమే హీరోయిన్‌గా ఖరారైంది. రాశి ఖన్నా హీరోయిన్‌ అంటున్నారుగానీ, స్పష్టత లేదు అని సమాచారమ్‌. సినిమా షూటింగ్‌ అయితే శరవేగంగా జరుగుతోంది. ఇటీవలే విడుదలైన ఫస్ట్‌లుక్‌కి మంచి స్పందన వస్తోంది. 'జనతా గ్యారేజ్‌' సినిమా విజయం తర్వాత ఎన్టీఆర్‌ ఏరి కోరి ఎంచుకున్న సినిమా ఇది. అందుకే ఈ సినిమాపై విపరీతంగా అంచనాలున్నాయి. 

ALSO READ: క్లాప్ కొట్టిన అల్లు వారసులు