ENGLISH

థియేటర్ బిజినెస్ లోకి నితిన్

18 June 2024-15:32 PM

టాలీవుడ్ హీరోలు చాలా మంది సినిమాలతో పాటు బిజినెస్ రంగంలోకి కూడా అడుగుపెడుతున్నారు. సొంత నిర్మాణ సంస్థలు, రెస్టారెంట్స్, బ్రాండెడ్ దుస్తులు, రియల్ ఎస్టేట్, థియేటర్స్ బిజినెస్ లలో కూడా సత్తా చాటుతున్నారు. ఇప్పటికే మహేష్, బన్నీ, రవితేజ లు థియేటర్స్ బిజినెస్ లోకి అడుగుపెట్టగా ఇప్పుడు  ఇదే దారిలో నితిన్ కూడా వెళ్తున్నాడు. థియేటర్ బిజినెస్ లోకి మొదట అడుగుపెట్టింది మహేష్. 'ఏఎంబీ' సినిమాల్ తో చాలామందికి మార్గదర్శకం అయ్యాడు. తరవాత బన్నీ, రవితేజలు కూడా ఏషియన్ గ్రూప్ తో కలిసి మల్టీప్లెక్స్ నిర్మాణాలు చేపట్టారు. వరస ప్లాఫ్ లతో సతమతమవుతున్న నితిన్ కూడా ఇప్పుడు ఈ బిజినెస్ లోకి అడుగుపెట్టాడు.       


నితిన్ కెరియర్ చాలా కాలంగా డౌన్ లో ఉంది. అన్నీ డిజాస్టర్లగా నిలుస్తున్నాయి. చాలా కాలానికి 'భీష్మ ' తో హిట్ కొట్టాడు. తరవాత మళ్ళీ డిజాస్టర్లే.  ప్రస్తుతం రాబిన్ హుడ్ సినిమాలో నటిస్తున్నాడు. కెరియర్ ఎలాగూ బాగోలేదు అని బిజినెస్ లోకి ఎంటర్ అయ్యాడు. ఈ క్రమంలోనే  సంగారెడ్డి ప్రాంతంలో 'ఏషియన్ నితిన్ సితార' పేరుతో మల్టీప్లెక్స్ ను నిర్మించే పనిలో పడ్డాడు. థియేటర్ పనులు దాదాపుగా పూర్తయ్యాయని త్వరలో ఓపెనింగ్ ఉంటుందని సమాచారం. నిన్న కాక మొన్న వచ్చిన హీరోలు కూడా పాన్ ఇండియా సినిమాలు తీస్తూ గుర్తింపు తెచ్చుకుంటూ ఉంటే నితిన్ టాలీవుడ్ లో కూడా సత్తా చాటలేకపోతున్నాడని కామెంట్స్ వినిపిస్తున్నాయి.