ENGLISH

కస్సుబుస్సులాడుతున్న అమలాపాల్‌

03 November 2017-12:19 PM

ఖరీదైన కారు కొనుగోలు చేసిన ముద్దుగుమ్మ అమలాపాల్‌ గవర్నమెంట్‌కి టేక్స్‌ ఎగ్గొట్టిందంటూ వివాదం తలెత్తింది. ఆ వివాదం కాస్త తెరపైకి వచ్చింది. దాంతో ఈ వివాదానికి పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాలనుకుంది ముద్దుగుమ్మ అమలాపాల్‌. ఈ మేరకు ఓ లేఖను విడుదల చేసింది. 'నా ఎదుగుదల చూసి ఓర్వలేకనే కొందరు కుట్రపూరితంగా నాపై బురద చల్లేందుకే ఈ ప్రచారాలు చేస్తున్నారనీ పేర్కొంది అమలాపాల్‌. జరుగుతున్న ప్రచారంపై చిర్రెత్తిన అమలాపాల్‌ కొంచెం ఘాటుగానే సమాధానాలిచ్చింది. నేను బాధ్యత గల పౌరురాలిని. ఆ విషయం నాకు తెలుసు. ఏడాదికి కోటికి పైగానే టేక్స్‌లు చెల్లిస్తుంటాను నేను. అలాంటిది నేనెందుకు టేక్స్‌ ఎగ్గొడతాను. అలాంటి ఉద్దేశ్యాలే నాకు లేవు.. అని అమలాపాల్‌ చిందేసింది. తెలుగు, తమిళ, కన్నడ, మలయాళ తదితర భాషల్లో నటిస్తున్న నటిని నేను. నేనెక్కడికైనా వెళ్లగలను. ఎక్కడైనా ఉండగలను. ఎక్కడైనా ఆస్థులు సమకూర్చుకొనగలను. భారతదేశ పౌరురాలిగా ఆ హక్కు నాకుంది. భారతదేశం నా మాతృభూమి. ఇలాంటి వివాదాలతో దేశం నుండి రాష్ట్రాల్ని వేరు చేయాలని చూస్తున్నారా? అంటూ ప్రశ్నిస్తోంది అమలాపాల్‌. అవును నిజమే ఆమె ఎక్కడైనా ఆస్థులు సంపాదించుకోవచ్చు. అయితే ఈ ప్రచారం ఎందుకింత విస్థృతమైందో కానీ, అమలాపాల్‌ మాత్రం భలే స్పందించింది. స్క్రీన్‌పై పేజీలు పేజీలు డైలాగులు చెప్పడమే కాదు. రియల్‌ లైఫ్‌లో కూడా సినిమా డైలాగులు బాగానే పేల్చేసింది ఈ ముద్దుగుమ్మ. అమలాపాల్‌తో పెట్టుకుంటే అంతే మరి!

 

ALSO READ: హీరో పుట్టినరోజు వేడుకల్లో అపశ్రుతి