బింబిసార లాంటి విజయం తర్వాత కల్యాణ్ రామ్ నుంచి వస్తున్న చిత్రం ‘అమిగోస్’. మైత్రీ మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తున్న ఈ సినిమాతో రాజేంద్ర రెడ్డి దర్శకుడిగా పరిచయమవుతున్నారు. ఆషికా రంగనాథ్ కథానాయిక. ఈ చిత్రం విడుదలకు ముందే సేఫ్ జోన్ లోకి వెళ్ళింది. నాన్ థియేట్రికల్ రైట్స్ తో టోటల్ బడ్జెట్ రికవర్ అయింది. ఇప్పుడు దాదాపు తొమ్మిది కోట్లకు తెలుగు రాష్ట్రాల థియేట్రికల్ హక్కులు వెళ్ళాయి. కళ్యాణ్ రామ్ గత చిత్రం బింబిసార అనూహ్య విజయాన్ని సాధించింది. ఇప్పుడా క్రేజ్ మైత్రీ మూవీ మేకర్స్ కి కలిసోచ్చిందని చెప్పాలి.
ఈ చిత్రంలో కళ్యాణ్ రామ్ మూడు పాత్రల్లో కనిపించనున్న సంగతి తెలిసిందే. ఓ పాత్రలో సిద్ధార్థ్ అనే వ్యాపారవేత్తగా, మరో పాత్రలో మంజునాథ్ అనే సాఫ్ట్వేర్ ఇంజినీర్గా కనిపించగా.. మూడో పాత్ర వైల్డ్ గా కనిపించింది. ఒకే పోలికలతో ఉన్న ముగ్గురు వ్యక్తుల కథతో రూపొందుతోన్న చిత్రమిది. ట్రైలర్ కూడా ఆసక్తిని పెంచింది. ఫిబ్రవరి పదిన సినిమా ప్రేక్షకుల ముందుకు వస్తోంది.