ENGLISH

'జై లవకుశ' మేనియా ఆకాశమే హద్దు

21 September 2017-12:16 PM

భారీ అంచనాల నేపథ్యంలో తెరకెక్కిన యంగ్‌ టైగర్‌ ఎన్టీయార్‌ తాజా చిత్రం 'జై లవ కుశ' ఈ రోజే ప్రేక్షకుల ముందుకొచ్చింది. నిన్న రాత్రి నుంచే కొన్ని చోట్ల సినిమా ప్రదర్శితం కావడంతో అభిమానుల నుంచి సినిమాకి సూపర్‌ పాజిటివ్‌ టాక్‌ ఉదయానికి స్ప్రెడ్‌ అయిపోయింది. సినిమా అనుకున్నప్పట్నుంచీ ముఖ్యంగా 'జై' పాత్ర పైనే అంచనాలు నెలకొన్నాయి. అందుకు తగ్గట్లుగానే ఆ పాత్ర అందర్నీ మెస్మరైజ్‌ చేసేస్తోందట. నెగిటివ్‌ టచ్‌ అయినా, కామెడీ టచ్‌ అయినా ఈ క్యారెక్టర్‌ నుంచే ఎక్కువ ఎక్స్‌పెక్ట్‌ చేయొచ్చని ప్రచారం జరిగింది. ఆ ప్రచారం నిజమేనని సినిమా చూసినవారంటున్నారు. అలాగే నెగిటివ్‌ టచ్‌లో ఎన్టీఆర్‌ సూపర్బ్‌ అనిపించాడు. అయితే సినిమా విడుదలకు ముందే లీకుల గోల మొదలైంది. సీన్స్‌ వైజ్‌గా సినిమా వీడియోలు నెట్‌లో ప్రత్యక్షమైపోయాయి. ఎంతగా ప్రయత్నించినా లీకుల భూతం 'జై లవకుశ'ని వదలలేదు. దాంతో చిత్ర దర్శక నిర్మాతలు కొంత ఆందోళన చెందుతున్నారు. ఇదిలా ఉండగా, రాశీఖన్నా, నివేదా థామస్‌ తొలిసారిగా ఈ సినిమాలో ఎన్టీయార్‌తో జతకట్టారు. మూడు పాత్రల్లో ఎన్టీఆర్‌ చూపించిన వేరియేషన్‌ అభిమానుల్ని ఊపేస్తోందట. భారీ అంచనాల నడుమ విడుదలైన' జై లవకుశ' ధియేటర్స్‌ వద్ద పండగ వాతావరణం నెలకొంది. కాస్సేపట్లో సినిమా యాక్చువల్‌ టాక్‌ బయటకు రానుంది

ALSO READ: నాకు నచ్చలేదు అని చెప్పిన నాగ్!