ENGLISH

మహేష్ రాజమౌళి మూవీ మల్టీస్టారరా!?

02 March 2024-09:43 AM

RRR సినిమా తరవాత రాజ మౌళి నుంచి ఇంకో సినిమా రాలేదు. దర్శక ధీరుడి కి వరల్డ్ వైడ్ గా ఉన్న క్రేజ్ మూలంగా ఈయన  నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఇంట్రస్ట్ గా ఉన్నారు. ఎట్టకేలకు జక్కన్న మహేష్ తో సినిమా అనౌన్స్ చేశారు. రాజమౌళి సినిమాల్లో హీరో క్యారక్టరైజేషన్ సూపర్ హీరోలా ఉంటుంది. ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా, పర్ఫెక్ట్ గా సినిమా రావటం కోసం జక్కన్న ఎన్ని రోజులు అయినా కష్ట పడతారు. అసలు మహేష్ -జక్కన్న కాంబో అనగానే అంచనాలు పీక్స్ కి వెళ్లాయి. అయితే ఈ మూవీ కి సంబధించిన లేటెస్ట్ న్యూస్ ఒకటి సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.


ఈ మూవీలో మహేష్ ఒక్కడే కాదని ఇంకో ఇద్దరు హీరోలుంటారని సమాచారం. ఈ న్యూస్ఈ బయటికి రావటంతో మహేష్ ఫాన్స్ కొంత కంగారు పడుతున్నారు. ఇది మల్టీస్టారర్ మూవీ అయి ఉండొచ్చు, మహేష్ కి అంత ఇంపార్టెన్స్ ఉంటుందా అని సందేహాలు మొదలయ్యాయి. మిగిలిన ఇద్దరు హీరోలు ఒకరు బాలీవుడ్ నుంచి,మరొకరు హాలీవుడ్ నుంచి అని టాక్. ఇప్పటికే ఈ సినిమాలో ఇండోనేషియాకి చెందిన చెల్సియా ఇస్లాన్‌ ను హీరోయిన్‌గా ఫిక్స్ చేసినట్టు తెలుస్తోంది. ఆమెతోపాటు దీపికా పదుకొనెని కూడా ఎంపిక చేసినట్టు సమాచారం. ఈ  మూవీ హాలీవుడ్ రేంజ్ లో తెరకెక్కటమే కాదు హాలీవుడ్ యాక్టర్స్ కూడా ఇందులో నటిస్తున్నారు. వెయ్యి కోట్ల భారీ బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు.


ఈ సినిమా పూర్తిగా అడ్వంచర్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కనుండటంతో బాలీవుడ్ నుంచి, హాలీవుడ్ నుంచి యంగ్ హీరోలని తీసుకుంటారని తెలుస్తోంది. ఈ చిత్రానికి 'మహారాజా', 'చక్రవర్తి' అనే టైటిల్స్ పరిశీలిస్తున్నారు. చివరికి ఏది ఫైనల్ అవుతుందో చూడాలి మరి.