ENGLISH

మాస్‌రాజా మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తాడా.!

26 October 2018-13:54 PM

మాస్‌రాజా రవితేజ జోరు కాస్త తగ్గిందనే చెప్పాలి. అయితే పూర్వ వైభవాన్ని తిరిగి పొందేందుకు మాస్‌ రాజా చేస్తున్న ప్రయత్నం అంతా ఇంతా కాదట. ఆయన తాజా చిత్రం 'అమర్‌ అక్బర్‌ ఆంటోనీ'తో మాస్‌ మహారాజ్‌ అంటే ఏంటో చూపిస్తానంటున్నాడు రవితేజ. ఈ సినిమా శీను వైట్ల దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. బెల్లీ బేబ్స్‌ ఇలియానా ఈ సినిమాతో సెకండ్‌ ఇన్నింగ్స్‌ స్టార్ట్‌ చేస్తోంది. 

అయితే ఈ సినిమాపై అంచనాలు అంతా ఇంతా అని చెప్పలేం కానీ, ఓ మోస్తరు అంచనాలైతే ఉన్నాయి. ఆ అంచనాల్ని రెట్టింపు చేసే దిశగా రవితేజ అండ్‌ టీమ్‌ రంగంలోకి దిగిందట. దాదాపు సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఇక ప్రమోషన్స్‌ మొదలెట్టడమే తరువాయి. ఏ సినిమాకైనా హిట్టు దక్కాలంటే ప్రమోషన్స్‌ తప్పనిసరి. ఆ ప్రమోషన్స్‌కి కాస్త క్రియేటివిటీ కూడా జోడించక తప్పడం లేదిప్పుడు. అయితే మరి మాస్‌రాజా అండ్‌ టీమ్‌ చేయబోయే ఈ క్రియేటివ్‌ పబ్లిసిటీ ఏంటో కానీ, మొత్తానికి సినిమాపై విపరీతమైన హైప్‌ పెంచే దిశగా వాటిని సిద్ధం చేస్తున్నట్లు టాక్‌ వినిపిస్తోంది. 

ఇంతవరకూ సినిమా నుండి విడుదలైన పోస్టర్స్‌ ఏమంత ఇంపాక్ట్‌ చూపించలేదు. ఇక ఈ నెల 29న రిలీజ్‌ కానున్న టీజర్‌తో ఫ్యాన్స్‌ ఓ ఐడియాకి వచ్చే ఛాన్సెస్‌ ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ ట్రిపుల్‌ రోల్‌ అనీ, కాదు కాదు మూడు డిఫరెంట్‌ గెటప్స్‌లో మాత్రమే కనిపిస్తాడనీ ఇలా ప్రచారం జరుగుతోంది. అయితే టీజర్‌లోనైనా ఆ విషయాన్ని రివీల్‌ చేస్తారా.? లేదా.? 

ఎలాగైనా మాస్‌రాజా తన మునుపటి మ్యాజిక్‌ రిపీట్‌ చేస్తాడో లేదో తెలియాలంటే సినిమా విడుదలయ్యేంత వరకూ ఆగాల్సిందే. సినిమా నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకు రానుంది.

ALSO READ: టీఆర్ఎస్ కోసం.. అర్జున్ రెడ్డి!